మొన్నటి వరకు బంగారం కొనాలని భావించిన పసిడి ప్రియులకు ఇప్పుడు ధరలు షాక్ ఇస్తున్నాయి. గత మూడు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్న ధరలు ఈరోజు ఇంకాస్త పైకి కదిలాయి. కొనుగోలు దారులకు ఇది చేదువార్తే అని చెప్పాలి. ఈరోజు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణం అంటున్నారు. కరోనా ప్రభావం కూడా బంగారం ధరల పై ఉన్నది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అదే విధంగా కొనుగోళ్లు కూడా ఒకేసారి పడిపోయాయి..



ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ.46,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 పెరిగి రూ.50,400కి చేరింది. ఇక నిన్నటి రోజున భారీగా పెరిగిన వెండి ధరలు ఈరోజు కూడా పెరిగాయి. ఇక ఈరోజు కూడా అదే విధంగా వెండి ధరలు పైకి కదిలాయి. ఏకంగా కిలో వెండి ధర రూ.1000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 68,900కి చేరింది.



వెండి తో తయారు చేసే వస్తువుల పై డిమాండ్ పెరగడంతో ఈరోజు భారీగా పెరిగింది. ఇక పోతే బంగారం, వెండి వస్తువుల వినియోగం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ వెండి, బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ రోజు ధరలను చూస్తే..కూడా బంగారం ధర జిగేల్ మంది. బంగారం ధర ఔన్స్‌కు 0.23 శాతం పెరుగుదలతో 1845 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం పెరుగుదలతో 24.21 డాలర్లకు చేరింది.. వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: