బంగారం కొనాలని అనుకునేవారికి భారీ షాక్ పసిడి ధరలు ఈరోజు  మార్కెట్ లో పరుగులు పెడుతున్నాయి. నిన్నటి ధారేతి  పోలిస్తే ఈరోజు ధరలు మాత్రం ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి. సిడి రేటు మళ్లీ పెరిగింది. 4 రోజులుగా పెరుగుతూ వచ్చి నిన్న ఒక్క రోజు విరామం ఇచ్చిన బంగారం రేటు మళ్లీ ఈరోజు పైకి కదిలింది. బంగారం ధర పైకి కదిలితే వెండి రేటు మాత్రం వెలవెలబోయింది. విదేశీ మార్కెట్ లో బంగారం ధర పడిపోయింది. ఇది మహిళలకు చేదు వార్త అనే చెప్పాలి


ఇకపోతే హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పైకి కదిలింది. దీంతో రేటు రూ.49,750 కు ఎగసింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.150 పెరుగుదల తో రూ.45,600 కు చేరింది. ఇక బంగారం ధరలకు రెక్కలు వస్తే.. వెండి ధరలు మాత్రం కిందకు దిగి వస్తున్నాయి. బంగారం ధర బాటలో కాకుండా వెండి రేటు వేరే దారిలో పయనించింది. వెండి ధర రూ.600 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.76,900కు దిగొచ్చింది.


 వెండిని ఎక్కువగా పరిశ్రమ రంగంలో వాడతారు.. ఆభరణాల తయారీ కోసం కూడా వాడతారు. అందువల్ల వెండికి డిమాండ్ ఎప్పటికీ ఉంటుందని గమనించాలి. వెండి ధరలపై గ్లోబల్ మార్కెట్ రేట్లు, డాలర్, అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులు మొదలగునవి ప్రభావాన్ని  చూపిస్తున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్‌ లో మాత్రం బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.48 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1872 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా క్షీణించింది. 0.98 శాతం తగ్గుదలతో 27.79 డాలర్లకు దిగొచ్చింది.మరి రేపటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: