గత సంవత్సరం జూలై 17 నుంచి సెప్టెంబర్ 25 వరకు హెల్త్ వర్కర్ల పై సర్వే చేశారు. ఈ సర్వేలో భాగంగా నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర అనారోగ్యాలు ఉన్నవారు ఇతరులతో పోలిస్తే కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని ఈ పరిశోధనల్లో వెల్లడయింది. ఇలాంటి వారిలో కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటమే కాకుండా, వారు కోలుకోవడానికి కూడా అధిక సమయం పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అదేవిధంగా రాత్రి ఒక గంట అదనంగా నిద్రపోయే వారిలో ఈ వైరస్ ప్రభావం 12 శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
సాధారణంగా కొంతమంది తరుచు మెలకువలో ఉండటం, గాడ నిద్ర లేకపోవడం, ఇతర నిద్ర సమస్యలు ఉన్నవారిలో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కోవిడ్-19 రోగులకు సేవలందించిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై ఆన్లైన్ సర్వే చేశారు. మొత్తం 2,884 మంది హెల్త్ కేర్ వర్కర్లపై ఈ సర్వే చేశారు. వీరిలో 568 మంది కోవిడ్-19 (Covid-19) బారిన పడ్డారు. వీరిలో రాత్రి ఎక్కువ సమయం గాడంగా నిద్రపోయే వారిలో వైరస్ ప్రభావం 12 శాతం తగ్గిందని, అలాంటి వారిలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని నిపుణులు వెల్లడించారు