కరోనా సెకండ్ వేవ్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఈ సెకండ్ వేవ్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. రోజు రోజుకి కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి. ఇక
కరోనా వైరస్ సోకిన వాళ్లలో చాలామంది అప్పటికే కరోనా బారిన పడిన వాళ్లు వాడిన మందులనే వాడుతూ ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకుంటున్నారు.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
కరోనా వైరస్ కు సంబంధించి, కరోనాకు వాడుతున్న మందులకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. తాగునీటి వ్యవస్థ ద్వారా కరోనా వ్యాప్తి చెందదని నిపుణులు తెలిపారు.రెమ్డెసివిర్ ఇంజక్షన్లు వైరస్ వ్యాప్తిని తగ్గిస్తాయే తప్ప నియంత్రించలేవని నిపుణులు పేర్కొన్నారు. వేడినీళ్లు తాగడం వల్ల, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనాను నియంత్రించవచ్చని చాలామంది భావిస్తున్నారని వేడి నీళ్లు తాగితే కరోనా చస్తుంది అనేది అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువగా ఉండి ఆయాసం ఉంటే ఆస్పత్రికి వెళ్లాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.
అప్పుడే జన్మించిన శిశువుకు తల్లి నుంచి కరోనా ఇప్పటివరకు సోకలేదని వేరే రోగులు, ఇతర కారణాల వల్ల కరోనా సోకే అవకాశాలు అయితే ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకిన తల్లులు ఎన్95 మాస్కు వేసుకుని పిలల్లకు పాలు ఇవ్వవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల తర్వాత వైరస్ సోకే అవకాశాలు అయితే తగ్గుతాయి.ఇతర వైరస్ లకు కనుగొన్న వ్యాక్సిన్లు కరోనాకు పని చేయవని ఆ వ్యాక్సిన్లు వేయించుకున్నా ఫలితం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకిన తొలి 3 నుంచి 4 రోజుల్లో ఫావి ఫిరావిర్ లేదా ఫాబి ఫ్లూ మందులను వాడాలని డెక్సామెథజోన్ అనే స్టెరాయిడ్ కరోనాకు
చెక్ పెట్టడంలో బాగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటేనే డెక్సామెథజోన్ ను వాడాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి కూడా భయపడకుండా ఉంటే చాలా మంచిది. అలా అని చెప్పి అజాగ్రత్తగా ఉండటం కూడా సబబు కాదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి...