కొద్ది రోజుల క్రితమే భగ భగ మండే ఎండాకాలం నుండి తెలుగు ప్రజలకు ఉపశమనం దొరికినట్లయింది... ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ మొదలైపోయింది. అయితే వర్షాలు మెల్ల మెల్లగా పడితే సరే... కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వర్షాలు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా జోరున ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీనితో కేసీఆర్ ప్రభుత్వం అన్ని స్కూల్స్ కు  కూడా వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించడం జరిగింది. మిగిలిన కంపెనీలకు సైతం వర్క్ ఫ్రమ్ హోం ను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. అయితే వర్షాకాలంలో ఎవ్వరికైనా వేడి వేడిగా ఏమి తిందామా అని ఉంటుంది.

అందుకే పట్టణాలలో ఉండే వారు అలా బయటకి వెళ్లి సమోసా, బజ్జీ, బోండా, పానీ పూరి లాంటివి తింటూ ఉంటారు. అయితే ఏ టైం అయినా కూడా పానీ పూరి లకు ఉండే క్రేజ్ వేరే... అందుకే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ వర్షాకాలంలో పానీ పూరీలు తినడం చాలా ప్రమాదం అని తెలుస్తోంది. అయితే ఈ పా పూరీలు చేసే వ్యక్తి లేదా చేసే ప్రదేశం పరిశుభ్రంగా లేకపోతే లేని పోని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తాజాగా తెలంగాణ డి ఎమ్ హెచ్ ఓ శ్రీనివాసరావు అందరికీ చెప్పిన విషయం తెలిసిందే. షాప్ వ్యక్తి పూరీలు అయితే సెపరేట్ గా చేస్తాడు. కానీ పానీ తయారుచేసే విధానం మాత్రం సరిగా ఉండదు.

అందులో కావలసిన పదార్ధాలను ఒక పాత్రలో వేసి నీళ్లు పోసి, తన తన చేతులతోనే మిక్స్ చేస్తాడు. అందుకే పానీ మలినం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ వర్షాకాలంలో ఇలాంటి ఫుడ్ తినడం ఇబ్బందికరం. మీరు ఒకవేళ ఈ పానీ  పూరి తింటూ ఉంటే వెంటనే మానేయండి. దీని వలన క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: