మన వంటిట్లో లభించే పదార్థాలతో ఈ ఆరోగ్యవంతమైన టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల వాత రోగాలు, కొలెస్ట్రాల్, నరాల బలహీనత, అధిక బరువు ఇంకా అలాగే మూత్రపిండాల సమస్యలను దూరం అవుతాయి.ఈ టీ ని తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. నీరసం, అలసట, ముఖం అంవిహీనంగా మారడం, అజీర్తి, గ్యాస్, కండరాల నొప్పులు ఇంకా కీళ్ల నొప్పులు వంటి సమస్యలన్నింటిని దూరం అవుతాయి. అయితే ఈ టీ ని తయారు చేసుకోవడానికి  మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి మనం ఈ టీ ని తయారు చేసుకోవచ్చు. ఈ టీ కోసం మనం సోంపును, ఆవాలను ఉపయోగించాల్సి ఉంటుంది.ఈ టీ ని తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. ఆ తరువాత ఇందులో 2 టీ స్పూన్ల సోంపు గింజలను కూడా వేసి వేడి చేయాలి. ఇక ఆ నీళ్లు బాగా మరిగిన తరువాత తరువాత ఇందులో అర టీ స్పూన్ ఆవాలను వేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. ఒక గ్లాస్ నీళ్లు అర గ్లాస్ అయ్యే దాకా మరిగించిన తరువాత ఈ నీటిని వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి.


వడకట్టిన ఆవాలను ఇంకా సోంపు గింజలను పడేయకుండా అలాగే ఉంచాలి. వీటితో మరలా టీ ని తయారు చేసుకుని తాగవచ్చు. ఇలా తయారు చేసుకున్న టీ ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. ఇంకా అలాగే సాయంత్రం 4 లేదా 5 గంటల సమయంలో తాగాలి. ఇలా ప్రతి రోజుకు రెండు సార్లు క్రమం తప్పకుండా ఈ టీని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.మూత్రపిండాల సమస్యలనేవి మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ టీని స్త్రీలు తాగడం వల్ల వారిలో హార్మోన్ల సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి.మనం తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా ఉంటుంది. దీంతో మనం అధిక బరువు సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.


మన శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే ఈ టీని తాగడం వల్ల చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై ముడతలు, మచ్చలు ఇంకా మొటిమల సమస్యల తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. అలాగే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఈ విధంగా ఈ టీని తయారు చేసుకుని తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: