గోంధ్ మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. అలాగే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.అలాగే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రోజంతా చాలా ఉత్సాహంగా ఉండవచ్చు. పురుషులు దీనిని తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.ఇంకా బాలింతలు దీనిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. మన ఆరోగ్యానికి బాగా మేలు చేసే ఈ గోంధ్ తో మెదడు పనితీరు మెరుగుపడేలా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందేలా స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ నెయ్యి వేడయ్యాక గోంధ్ ను వేసి వేయించాలి. గోంధ్ చక్కగా పొంగి తెల్లగా అయ్యే దాకా వేయించిన తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఆ తరువాత అదే నెయ్యిలో బాదంపప్పు, జీడిపప్పు ఇంకా వాల్ నట్స్ వేసి వేయించాలి. ఆ తరువాత గసగసాలు వేసి వేయించాలి. చివరగా కొబ్బరి పొడిని కూడా వేసి వేయించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించిన గోంధ్ ను తీసుకుని దానిని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆ తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.


తరువాత జాజికాయ పొడి, యాలకులు ఇంకా అలాగే శొంఠి వేసి మరోసారి మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో పాలు పోసి ఒక పొంగు వచ్చే దాకా వేడి చేయాలి.ఆ పాలు మరిగిన తరువాత మంటను చిన్నగా చేసి మిక్సీ పట్టుకున్న పొడిని వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలిపిన తరువాత దగ్గర పడే దాకా ఉడికించాలి. ఈ మిశ్రమం నెయ్యి వదులుతూ కళాయికి అంటుకోకుండా వేరయ్యే దాకా ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక ఈ మిశ్రమం చల్లారిన డబ్బాలో వేసి మూత పెట్టి ఫ్రిజ్ లో ఉంచి స్టోర్ చేసుకోవాలి. ఇది 20 రోజుల దాకా తాజాగా ఉంటుంది. రోజుకు ఒక స్పూన్ మోతాదులో దీనిని తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఇంకా పెద్దలు ఎవరైనా దీనిని తీసుకోవచ్చు.ఇంకా ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది. అలాగే మెదడు పని తీరు మెరుగుపడుతుంది. ఇంకా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.శరీరం చాలా ధృడంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: