
దీనికోసం ముందుగా 6 నుంచి 8 వరకు సోంపు ఆకులను తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి.ఈ ఆకులు మందంగా కలిగి కారంగా ఉంటాయి.వీటిని ఇప్పుడు కట్ చేసి ఒక బాండీలో గ్లాస్ నీటిలో వేసి బాగా ఉడికించుకోవాలి.ఇందులోనే చిన్న ముక్క అల్లం,చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి బాగా ఊడికిన తర్వాత దింపి, ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ తేనే కలిపి తీసుకోవాలి.ఈ టీ ని కాఫీ,టీలకు బదులుగా వారంలో రెండు మూడు రోజులు తాగొచ్చు.
ఈ సోంపు ఆకుల టీని తీసుకోవడం వల్ల,కడుపు ఉబ్బరంతో బాధపడే వారికి మంచి ఉపశమనం కలుగుతుంది.అంతేకాక చాలా తీవ్రమైన దగ్గు జ్వరం జలుబుతో పడేవారు పొద్దున,సాయంత్రం సోంపు ఆకులతో తయారు చేసిన టీ తాగడం ఉత్తమం.అంతే కాక ఈ టీతో కడుపులో గడబిడ,మంట,త్రేన్పులు, ఎక్కిళ్లు,కడుపు నొప్పి,అరుచి,కడుపులో బరువుగా ఉండటం లాంటి సమస్యలకు తొందరగా మంచి నివారణకు కలుగుతుంది.మరియు చిన్న పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి అధికంగా వచ్చే నులి పురుగుల సమస్య తగ్గుతుంది.ఇంకా మైగ్రేన్ తలనొప్పి ఇబ్బంది పడేవారు రోజూ సోంపు టీ రెండు పూటలా తాగుతూ ఉంటే చాలా వరకు తగ్గుతుంది.క్యాలిషియం డెఫిషియన్సీతో వచ్చే సయాటికా నడుము నొప్పి,కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ టీ బాగా ఉపయోగపడుతుంది.అప్పటికప్పుడు ముంచుకొచ్చే ఉబ్బసం,ఆయాసం తగ్గిపోతాయి.కావున మీరు కూడా ఈ సోంపు ఆకుల టీ అలవాటు చేసుకొని, ఆరోగ్యంగా ఉండండి.