ఈ మధ్య కాలంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది కూడా కంటి సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈరోజుల్లో చాలామందిలో కంటి చూపు బాగా మందగిస్తుంది.ఫోన్, లాప్ టాప్, టాబ్లెట్ ఇంకా టీవీ వంటి స్మార్ట్ గడ్జెట్స్ ను ఎక్కువగా వినియోగించడం వల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఇంకా అలాగే ఆహారపు అలవాట్లు, పోషకాలు కొరత, అధిక ఒత్తిడి తదితర కారణాల వల్ల కూడా కంటి చూపు తగ్గుతుంది. ఏదేమైనా చూపు తగ్గడం వల్ల కళ్లద్దాలపై ఎక్కువగా ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అయితే అలాంటి పరిస్థితి మీకు రాకూడదంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే గింజలను ఖచ్చితంగా తీసుకోండి. ప్రతి రోజు ఈ గింజలను తింటే మీ కంటి చూపు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది.అయితే జీర్ణ సమస్యలను దూరం చేయడానికి మాత్రమే సహాయపడతాయని ఎక్కువ శాతం మంది భావిస్తుంటారు. కానీ పోషకాల నిలయమైన సోంపు గింజలు ఆరోగ్యపరంగా చాలా రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి.


మరీ ముఖ్యంగా సోంపు గింజల్లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. మరి వీటిని ఎలా తీసుకుంటే కంటి చూపు పెరుగుతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ని ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల సోంపు గింజలు వేసి ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి.ఇక ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు బాదం పప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న సోంపు గింజలు ఇంకా బాదం పప్పు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.తరువాత ఈ పౌడర్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఇక రాత్రి నిద్రించడానికి అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న సోంపు బాదం పొడితో పాటు వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా నిత్యం  చేస్తే కంటి చూపు ఖచ్చితంగా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే కళ్ళు నీరు కారడం, కళ్ళు ఎర్రబడడం వంటి సమస్యలు ఉన్నా కానీ చాలా ఈజీగా దూరం అవుతాయి.అలాగే కంటి సంబంధిత వ్యాధులు కూడా మన దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: