గజ్జి నుంచి ఉపశమనం పొందటానికి రోజువారీ చర్మ సంరక్షణ పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. ఈ పద్ధతులు స్కిన్ మరింత దెబ్బతినకుండా కాపాడతాయి.ముఖ్యంగా కఠినమైన, మరీ ఘాటు వాసనలతో కూడిన సబ్బుల విషయంలో ఖచ్చితంగా  జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి మన చర్మం నుంచి సహజ నూనెలను ఎక్కువగా తొలగిస్తాయి.ఇంకా అదే విధంగా వీటిల్లోని రంగులు, వాసనలు, సుగంధ ద్రవ్యాలు.. లాంటివి దురద, అలర్జీకి ఖచ్చితంగా కారణం కావొచ్చు. కాబట్టి మనం మృదువైన సబ్బులు స్నానానికి వాడుకోవాలి.అలాగే ధరించే దుస్తువుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బిగుతైనవి, గరుకుగా ఉండే ఉన్ని దుస్తులకు చాలా దూరంగా ఉండడం మేలు. ఇవి ఖచ్చితంగా చర్మానికి చికాకు కలిగిస్తాయి. అందుకే వదులైన దుస్తులు, మెత్తటి, నూలు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది.అలాగే గజ్జి ఉన్నవారికి చెమట మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. కాబట్టి గదిలో ఫ్యాన్‌, ఏసీ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకా గాలి ఆడే దుస్తులు ధరించాలి. వీలైతే ఇంట్లో హ్యూమిడిఫయర్‌ పరికరం అమర్చుకోవాలి. ఇది నీటి ఆవిరిని గాలిలోకి వెదజల్లి.. చర్మ సంరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది.


ఎగ్జిమా వంటి చర్మ సమస్యలతో దురద చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకు గోకకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అయితే గోళ్లతో గోకటానికి బదులు.. వేలి చివర్లతో మృదువుగా రుద్దొచ్చు. ఇక మరో ట్రిక్ ఏమంటే.. గజ్జి ఉన్న ప్రాంతాన్ని పదే పదే అస్సలు చూడొద్దు. ఎందుకంటే దీనివల్ల ఆలోచన అటువైపు మళ్లి.. గోకాలనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది.మీ చర్మం కనుక దెబ్బతింటే.. ఆ ప్రాంతం తేమను సరిగా క్యాచ్ చేయలేదు.కాబట్టి.. అక్కడ రోజులో చాలాసార్లు మందంగా మాయిశ్చరైజర్‌ ని రాసుకోవాలి. అలా చేయడం వల్ల అది తేమను పట్టి ఉంచుతుంది. దాంతో దురద భావన తగ్గి మీకు హాయిగా ఉంటుంది. ఇందుకోసం మినరల్‌ నూనె, పెట్రోలియం జెల్లీ వంటివి మీరు వాడొచ్చు. అయితే వీటిల్లో స్కిన్కు సరిపోయేవి మాత్రమే ఎంచుకోవాలి.మీరు ఓట్స్‌ అటుకులను తీసుకొని వాటిని మెత్తగా పొడి చేసి, గోరు వెచ్చటి నీటిలో కలిపి 10 నిమిషాల తర్వాత స్నానం చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఈ ఓట్స్‌లోని ప్రత్యేక రసాయన మిశ్రమాలనేవి చర్మం పైపొరను బలోపేతం చేస్తాయి.ఇంకా అలాగే స్నానం చేశాక తువ్వాలుతో అద్దుకొని, చర్మం పొడిగా ఉండేలా చేసుకోవాలి. ఇక ఆ తర్వాత వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: