ఈ మధ్యకాలంలో చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పళ్ళు పుచ్చుకోవడం కానీ,పళ్ళు పాచి పట్టడం కానీ లేదా గుట్కా మరకలు లాగా చిన్న చిన్న గుంటల్లా గాని ఏర్పడడం సర్వసాధారణమైపోయింది.దీనికి కారణం వారి ఆహారంలో ఎక్కువగా స్వీట్స్ మరియు జంక్ ఫుడ్ లో తినడం వల్ల,అవి పళ్ళపై ఉన్న ఎనామిల్ ని దెబ్బ తీయడమే.ఇలాగే కొనసాగితే క్రమంగా వారు చిన్న వయసులోనే పళ్ళను మొత్తం పోగొట్టుకోవాల్సిన ప్రమాదం రావచ్చు.వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఎంత మంచి పేస్ట్ వాడి బ్రష్ చేసినప్పటికీ తగిన ఫలితాలు రాకుండా ఉన్నాయి.అలాంటి వారి కోసం మన ఇంట్లో మరియు చుట్టుపక్కల దొరికే కొన్ని పదార్థాల ద్వారా పళ్ళను శుభ్రంగా ఉంచుకోవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.అసలు పళ్ళను పాచి లేకుండా తయారు చేసే పదార్థాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

ఉప్పు..

వారానికి రెండు నుంచి మూడుసార్లు ఉప్పు మరియు ఆవనూనెతో కలిపి బ్రష్ చేయడం వల్ల పళ్లపై పాచి పర్మనెంట్ గా పోతుంది.ఇది ఇది చూడటానికి పాతకాలం పద్ధతి అయినప్పటికీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది.

జామాకులు..

జామ ఆకులను బాగా ఎండబెట్టి పొడి లాగా చేసుకుని ఉప్పు కలిపి బ్రష్ చేసుకోవడం వల్ల, పళ్ళపై ఎలాంటి మరకలు ఉన్నప్పటికీ వెంటనే తొలగిపోతాయి.అంతేకాక ఇందులో ఉన్న విటమిన్ సి చిగుళ్ళను దృఢపరిచి, దంత ఆరోగ్యాన్ని పెంచుతుంది.

నారింజ తొక్క..

వీటిని వాడటం దంతాలను తెల్లగా మార్చడానికి ఒక మంచి మార్గం అని చెప్పవచ్చు.రోజూ ఉదయాన్నే నారింజ తొక్కతో పళ్ళు తోముకోవాలి.దీనితో దంతాలను తెల్లగా మరియు బలంగా మారుతాయి.మరియు ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనలు పోగొట్టమే కాకుండా ఎలాంటి దంత సమస్యలు ఉన్నా తొందరగా తొలగిపోతాయి.

నిమ్మకాయ..

మెరిసే దంతాలు కోసం నిమ్మకాయకు మించిన ప్రత్యామ్నాయం లేదని చెప్పవచ్చు.దీని కోసం చిటికెడు ఉప్పు,కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి బ్రష్ చేయడం తో దంతాలు తెల్లగా మారుతాయి.

కావున మీరు కూడా మీ దంతాలు మెరిపించాలంటే పైన పదార్థాలతో రోజు బ్రష్ చేయడం అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: