చాలామందికి సీజనల్గా గొంతులో కఫం చేరితే కొంతమందికి మాత్రం ఊపిరితిత్తులలో కఫం గడ్డకట్టి ఎంత దగ్గినా ఎంత జాగ్రత్తలు పాటించినా కఫం మాత్రం బయటికి రాదు.వారు ఎప్పుడు నస దగ్గుతో బాధపడుతూ వుంటారు.అలా కఫం రాకుండా అక్కడే గడ్డకట్టిపోయి ఉండడం వల్ల రాను రాను ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.దీనిని తగ్గించుకోవడానికి చాలామంది యాంటీబయోటిక్స్ ఎంత వాడినా,అప్పటికప్పుడు ప్రయోజనం కలుగుతుందే కానీ దీర్ఘకాలిక ప్రయోజనం అస్సలు కలగదు.అలాంటి వారి కోసం లిల్లీ పూలతో చేసే చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..అసలు లిల్లీ పూలతో కఫం ఎలా కరిగించుకోవచ్చో మనము తెలుసుకుందాం పదండి..

దీని కోసం లిల్లీ పూలను 100 గ్రామ్స్ చొప్పున తీసుకొని బాగా ఎండబెట్టుకోవాలి.ఇలా ఎండబెట్టిన లిల్లీ పూలతో రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు కలిపి మెత్తని మిశ్రమంలో పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఇలా ఊపిరితిత్తుల్లో గడ్డకట్టిన కఫంతో బాధపడేవారు,రోజు చిటికెడు పైన చెప్పిన మిశ్రమాన్ని తీసుకొని,ఒక స్ఫూన్ తేనె కలిపి చిన్న గోళీల తయారు చేసి తినాలి.ఇలా పది రోజుల పాటు చేయడం వల్ల లంగ్స్ లో పేరుకుపోయిన కఫం మెల్ల మెల్లగా కరిగి,ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.

దీర్ఘకాలికంగా దగ్గు,జలుబుతో బాధపడే వారికి కూడా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బ్యాక్టీరియా మరియు ఫంగస్ కలిగించే జబ్బులను దూరంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.మరియు మిరియాలలోని సుగుణాలు, తేనే ఊపిరితిత్తులలోని ఉన్న చమ్మను తీసివేయడమే కాకుండా,రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.ఆస్తమా రోగులకు సైతం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఇలాంటి సమస్యతో బాధపడేవారు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం.బయటికి వెళ్లేటప్పుడు స్వెటర్,మఫ్లర్ వంటివి ధరించడం చాలా మంచిది.మరియు వేడి ఆహారం,వేడి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: