మన హిందూ సాంప్రదాయంలో అరటి ఆకు,అరటి చెట్టు,అరటి పండుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.వీటివల్ల చాలా పవిత్రత లభిస్తుందని భావిస్తూ ఉంటాము.ఇంకా ఇక ఫంక్షన్లలో అయితే అరిటాకు భోజనం తింటే చాలా మంచిదని అరిటాకులోనే భోంచేస్తూ ఉంటాము. సాధారణంగా అరటిపండు లో చాలా మంచి ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని తీసుకుంటూ ఉంటాము. కానీ అరిటాకు వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ అరిటాకులో ఎన్నో ఆయుర్వేద గుణాలు దాగి వున్నాయ్ కనుక. మరి అవేంటో చూద్దాం పదండి..

రోజూ అరిటాకు ఒక స్ఫూన్ మొతాదులో తీసుకోవడం వల్ల డైజేషన్ ప్రాబ్లమ్స్ పూర్తిగా తొలగిపోతాయి.ఎండిన అరటి ఆకులను తీసుకోవడం వల్ల రక్తస్రావంతో కూడిన విరేచనాలు నయమవుతాయి.అంతేకాక గాయం చిన్నదైతే అరటి ఆకు రసం తాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

ఎవరైనా అధిక స్ట్రెస్ తో ఇబ్బంది పడుతూ ఉంటే,అరటి ఆకులో ఐస్ ముక్కను చుట్టి తలపై మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తొందరగా తగ్గుతుంది.

చర్మ అలర్జీ కలిగినప్పుడు ఉన్నవారికి, ఆ చర్మంపై అరిటాకు రసాన్ని రాయడంతో చాలా ఉత్తమం.
అరటి ఆకు కషాయాన్ని రోజుకు ఒకసారి తాగితే జ్వరం కూడా తగ్గుతుంది.

అరటి ఆకు రసాన్ని తీసుకుని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి బాగా అరిన తర్వాత తలస్నానం చేస్తే చుండ్రును కలిగించే పంగస్ తొలగిపోయి జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.

కాలిన గాయాలు మరియు మచ్చలు వున్నాత్తాయితే అరటి ఆకును తీసుకొని వేడిచేసి,అల్లం నూనెలో ముంచి గాయంపై కట్టితే గాయం తొందరగా మానిపోతుంది.

కడుపుతో వున్నవారు అరటి ఆకులను ఇంచ్ మొత్తాదులో తినడం అలవాటు చేసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మిరప మొక్క చిగురు ఆకు,అరటి ఆకు రసాన్ని కలిపి రాసుకుంటే మచ్చలు, దురద వంటి సమస్యలు తొందరగా నయమవుతాయి.

దోమలు కుట్టడం,పొక్కులు వస్తే అరటి ఆకు రసం, ఆలివ్ ఆయిల్,మైనం కలిపి అప్లై చేయడంతో పొక్కులు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: