మనం నిత్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ వ్యాయామం చేయడం ఎంత అవసరమో అన్ని పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవడం కూడా అంతే అవసరం. పోషకాలు అంటే కేవలం మనకు కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులే కాక విటమిన్స్‌, మినరల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి ఉండే ఆహారాలను మనం ఖచ్చితంగా ప్రతి రోజూ తినాలి. మనం ఖచ్చితంగా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు బ్రేక్ ఫాస్ట్‌ను తినేయాలి. మధ్యాహ్నం 1 గంట లోపు లంచ్ పూర్తి చేయాలి. రాత్రి 8 గంటల లోపు డిన్నర్ చేసేయాలి.రాత్రి తిన్న తరువాత నిద్రకు కనీసం 3 గంటల వ్యవధి ఉండాలి. ఈ విధంగా ఆహారం తీసుకునే విషయంలో సమయ పాలన పాటించాలి. అప్పుడే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఇక కొందరు తిన్న వెంటనే లేదా తింటానికి ముందు నీళ్లను తాగుతారు. ఇలా కూడా చేయకూడదు. 


కనీసం 30 నిమిషాల గ్యాప్ ఉండాలి. లేదంటే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలు మనకు సరిగ్గా లభించవు. ఇక కొందరు భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ తాగుతారు. ఇలా తాగితే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. కనుక ఇలా కూడా చేయకూడదు. ఇక కొందరు చాలా వేగంగా భోజనం చేస్తారు. ఇది కూడా మంచిది కాదు. దీని వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. పోషకాలు లభించవు. ఆహారాన్ని నెమ్మదిగా నములుతూ మింగినప్పుడే సరిగ్గా జీర్ణమై దాని ద్వారా మనకు పోషకాలు లభిస్తాయి. మనకి నిత్యం ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మనకు పోషకాలు సరిగ్గా లభించాలంటే మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం, రాత్రి లంచ్, డిన్నర్‌లను సరైన టైములో చేయాలి. అప్పుడే మన శరీరం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తుంది. ఇలా తింటేనే పోషకాలు మనకు లభిస్తాయి.లేకుంటే ఖచ్చితంగా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: