గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ కోసం కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కచ్చితంగా ఉంది. గర్భిణీ మహిళలు ముఖ్యంగా తాము తినే ఆహారంలో కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి ఇంట్లో మిగిలిపోయిన పదార్ధాలు తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వారు మిగిలిపోయిన వాటిని తినడం పూర్తిగా మానేయాలి.ప్రత్యేకించి వాటిని సరిగ్గా నిల్వచేయకుండా మళ్లీ వేడి చేసి తినడం చాలా అంటే చాలా ప్రమాదకరమని గుర్తించాలి.  తినే ముందు కచ్చితంగా సబ్బు, నీటితో చేతులను శుభ్రంగా కడగాలి. సబ్బు, నీరు అందుబాటులో లేనట్లయితే కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ను కచ్చితంగా ఉపయోగించండి.ముఖ్యంగా ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిది.బయట తినే పచ్చి ఆహారాలు, ముఖ్యంగా పానీయాలు (పానీ పూరీ రసం, జల్ జీరా, చెరకు రసం, మొలకలు, స్ప్రౌట్స్‌ వంటివి) కచ్చితంగా మానుకోండి.


అలాగే సీ ఫుడ్‌ తీనే సమయంలో దానిని మంచిగా వండారా లేదా అనేది కచ్చితంగా పరీక్షించండి. లేదంటే ప్రమాదకరమైన బాక్టీరియా అనేది దరిచేరుతుంది. ఇంకా ఫుడ్‌ స్టోర్‌లు లేదా బఫేల నుంచి ముందుగా ప్యాక్ చేసిన సలాడ్‌లు, ఆహార పదార్థాలను నివారించండి. అవి ఎప్పటి నుంచో ఆరుబయట ప్రదర్శించి ప్రమాదకర సూక్ష్మజీవులను నింపుకుని ఉంటాయి.ఇక బయట భోజనం చేయాల్సిన సమయంలో కేవలం పరిశుభ్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే రెస్టారెంట్లకు మాత్రమే వెళ్లండి. ఇక వీటిని గుర్తించడానికి ఆన్‌లైన్ రివ్యూలను కచ్చితంగా చదివి తెలుసుకోండి. అలాగే తాజాగా వండిన వేడివేడిగా వడ్డించే వంటకాలను మాత్రమే ఆర్డర్ చేయండి. ఇంకా సురక్షితమైన సీలింగ్‌ లేదా వేడి చేసిన నీళ్లను మాత్రమే బాటిల్స్‌లో వినియోగించండి. కాబట్టి కచ్చితంగా గర్భిణీ మహిళలు తినే ఆహారంలో ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే గర్భిణీ స్త్రీలు ఇంకా తమకు పుట్టబోయే పిల్లలు ఎంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: