ఒకప్పటితో పోల్చి చూస్తే నేటి రోజుల్లో టెక్నాలజీ మనిషి జీవనశైలిలో ఎన్ని మార్పులు తీసుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రస్తుతం ఏ పని చేయాలన్నా కూడా టెక్నాలజీ మీదే ఆధారపడుతూ ఉన్నాడు మనిషి   ఇక తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు కూడా ఇలాంటి టెక్నాలజీ ఆధారంగానే తయారైన స్మార్ట్ గ్యాడ్జెట్స్ చేసేస్తున్నాయ్. అయితే నేటి రోజుల్లో ఇక ఇలాంటి టెక్నాలజీ లో భాగంగానే ఎన్నో స్మార్ట్ గాడ్జెట్స్ కూడా ఇంట్లోకి తెచ్చి పెట్టుకోగలుగుతున్నాడు. ఇలాంటి వాటిలో ఇక రిఫ్రిజిరేటర్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.



 కూరగాయలు సహా ఎన్నో రకాల పదార్థాలను రిఫ్రిజిరేటర్ లో భద్రంగా ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇక ఎక్కువ కాలం పాటు అవి ఎంతో తాజాగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే నేటి రోజుల్లో ఇలా రిఫ్రిజిరేటర్ లేని ఇల్లు లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పేద మధ్యతరగతి ప్రజల సైతం తమ తాహకుతకు తగ్గట్లుగా ఫ్రిడ్జ్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం చూస్తూ ఉన్నాం. అయితే ఫ్రిడ్జ్ తెచ్చుకున్న తర్వాత కొంతమంది ఆ ఫ్రిడ్జ్ ని క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా రోగాలను కొనితెచ్చుకున్నట్లే అని చెబుతున్నారు నిపుణులు.


 అయితే ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేయకపోవడం వల్ల మహిళల్లో యూరినరీ సమస్యలు వస్తాయని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో బయటపడింది. కుళ్ళిన మాంసాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల ఎస్చచిరియా కొలై అనే బ్యాక్టీరియా ఏర్పడి.. అది ఇతర పదార్థాలకు వ్యాపించే ప్రమాదం ఉంది అంటూ ఇటీవలే యూఎస్ అధ్యయనంలో వెళ్ళడైంది. దీంతో దీంతో మహిళల్లో యూరినరీ సమస్యలు వస్తున్నట్లు అంచనా వేసింది. ఇంట్లోని ఫ్రీజ్ ను తరచూ శుభ్రం చేయడం మహిళల ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: