ఒకప్పుడు తాగునీరు కావాలంటే ఏం చేసేవారు  దగ్గరలో ఉన్న చెరువులు, బావుల్లో నుంచి తెచ్చుకుని మరీ తాగేవారు. లేదంటే ట్యాప్ వాటర్ తాగడం చేసేవారు. కానీ ఇప్పుడు అలా చేస్తున్నారా అంటే.. దాదాపుగా ఎవరూ చేయట్లేదు అని చెప్పాలి. ఒకప్పుడు సంపన్నులు మాత్రమే కేవలం ప్యూరిఫైయడ్ వాటర్ అంటూ కాస్త డబ్బులు ఖర్చు చేసి మరియు నీళ్లు శుద్ధి చేసిన నీళ్లను తాగే వాళ్ళు. కానీ ఇప్పుడు పేద మధ్యతరగతి ప్రజలు సైతం ఇలాంటి ప్యూరిఫైడ్ వాటర్ తాగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక ఏ ఊర్లో చూసిన వాటర్ ప్లాంట్ దర్శనమిస్తుంది.


 దీంతో బావులు చెరువుల్లో నుంచి నీళ్లు తెచ్చుకుని తాగే అలవాటు ఎప్పుడో కనుమరుగు  అయిపోయింది. ఇక ఇప్పుడు ట్యాప్ వాటర్ తాగే వారి సంఖ్య కూడా ఎక్కడా కనిపించడం లేదు. చాలామంది ఎలాంటి శ్రమ లేకుండా ఉండేందుకు ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్లు తెచ్చుకొని వాడుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. దీంతో మంచినీటి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా శుద్ధి చేసిన నీటిని పొందగలుగుతున్నాం అని అందరూ అనుకుంటున్నారు. కానీ ప్యూరిఫైడ్ వాటర్ తాగితే మాత్రం ఎన్నో ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్టే అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.


 ప్యూరిఫైడ్ వాటర్ కారణంగా మెగ్నీషియం లోపం ఏర్పడుతుంది అంటూ చెబుతున్నారు నిపుణులు. ఇక ఈ లోపం వల్ల మనిషిలోని నరాల వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతోందట. అంతేకాకుండా డయాబెటిస్ ఇస్కిమిక్ స్ట్రోక్ లాంటివి వస్తాయట. ప్రకృతి సిద్ధంగా లభించే నీటిలో పది నుంచి 20% మేరా మెగ్నీషియం ఉంటుందట. కానీ నేటి రోజుల్లో  వాడుతున్న ప్యూరిఫైడ్ లేదా మినరల్ వాటర్ లో మాత్రం అన్ని మినరల్స్ ను తొలగిస్తున్నారని ఇటీవల ఇజ్రాయిల్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దీంతో నీటి ద్వారా ఒక మనిషికి లభించాల్సిన మెగ్నీషియం లభించడం లేదని.. అందుకే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. అయితే ప్యూరిఫైడ్ వాటర్ మృత జలాలతో సమానం అంటూ చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: