సిద్ద మహాముని ఆశ్రమంలో శూరసేనుడు , రఘవీరుడు గుణశేఖరుడు అనే శిష్యులుండేవారు. సిద్దుడు ముగ్గురికి తన విద్యఅన్నింటినీ నేర్పి వారు అన్ని విద్యలలోనూ ఆరితేరే విధంగా తర్పీదు ఇచ్చాడు. కాలం గడుస్తుందీ. సిద్దుని వయసు పెరుగుతోంది. వౄద్దప్యం రావడంతో ఆశ్రమ బాధ్యతలను నిర్వహించలేక తన భాద్యతలను తన శిష్యులలో ఒకరికి అప్పగించాలనుకున్నాడు.
అయితే ముగ్గురు శిష్యులలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు. సరైన సమర్ధుడైన శిష్యుడు మాత్రమే ఆశ్రమ బాధ్యతలు నిర్వహించగలడని సిద్దుడికి తెలుసు అందువల్ల ఓ ఉపాయం ఆలోచించి శిష్యుల్ని పిలిచి. నాయనలారా ఇంతకాలం మీకు శిక్షణ ఇచ్చి నాకు తెలిసిన విద్యలన్నీ నేర్పాను. కాని నాకు కూడా వృద్దాప్యం వచ్చేసింది. అందువల్ల నేరు పోయేలోగా నాకు మీరు గురుదక్షణగా ఓ బతికిన లేగదూడను చంపి దాని రక్తాన్ని నాకు గురుదక్షిణగా ఇవ్వాలి అన్నాడు. దానికి ఊరసేనుడు., రఘవీరుడు స్వామీ మీరు చెప్పినట్లుగా మీకు గురుదక్షిణ సమర్పిస్తాం మాకు సెలవీయండి అంటూ లేగదూడ రక్తాన్ని తీసుకురావడానికి వెళ్లిపోయారు.
గుణశేఖరుడు మాత్రం సిద్దుడి వద్ద మౌనంగా ఉండిపోయాడు. అప్పడు సిద్దుడు గుణశేఖరుడితో నాయనా నీవు గురుదక్షిణ ఇవ్వవా ? నీ స్నేహితులిద్దరూ, గురుదక్షిణ ఇవ్వడానికి వెళితే నీవు మాత్రం మౌనంగా ఉన్నావేమిటని అడిగాడు. దానికి గుణశేఖరుడు గురువర్యా నన్న క్షమించండి నేను మీకు గురుదక్షిణ ఇవ్వలేని స్థితిలో ఉన్నాను అన్నాడు. విలపిస్తూ. ఏ ఎందుకు నాయనా ? అనడిగాడు సిద్దుడు.
మీరు చెప్పినట్లు గురుదక్షణ ఇవ్వవచ్చు కానీ అది మరో ప్రాణికి హాని తలపెట్టేదిగా ఉంది. ఒక ప్రాణిని నిర్ధాక్షిణ్యంగా చంపి మీకు గురుదక్షిణ ఇచ్చేకన్నా గురుదక్షిణ ఇచ్చుకోలేని నిస్సాహాయుడనని అనిపించుకోవడమే నాకు మనశ్శాంతిని కలుగజేస్తుంది. కనుక నా తప్పిదాన్ని మన్నించండి మహాత్మా అని ప్రాధేయపడ్డాడు. ఆ మాటలకు సిద్దుడు ఆనందపారవశ్యం చెందుతూ లే నాయనా లే యోగనేవాడు సమస్త ప్రాణులయందు దయా, ప్రేమా కలిగివుండాలి ఇతర ప్రాణులకు హాని తలపెట్టకుండా పరోపకారం చేయువాడే నిజమైన యోగిపుంగవుడు నాజానికి మీలో యోగ్యుడైన వాడిని ఎన్నిక చేయడం కోసమే నేనీ పరీక్ష పెట్టాను నేను ఊహించిన అర్హతలన్నీ నీలో ఉన్నాయి.
నీవు మాత్రమే ఆశ్రమ బాధ్యతలను నిర్వర్తించగలవు కనుక ఈనాటినుంచి నువ్వు ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తించు అంటే దీవించాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: