కందిపప్పు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.ఇక దీనిని తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ తో మన శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా చాలా ఈజీగా లభిస్తాయి.ఇంకా ఇవే కాకుండా కందిపప్పుతో మనం కంది కట్టును కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని మన పూర్వ కాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. ఈ కందికట్టును వేసవికాలంలో తయారు చేసుకుని తినడం వల్ల చాలా హాయిగా ఉంటుంది. దీనిని చాలా తక్కువ సమయంలో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, పుల్ల పుల్లగా ఉండే ఈ కంది కట్టును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


ఈ కందికట్టు తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..కందిపప్పు – ఒక గ్లాస్, నీళ్లు – 4 నుండి 5 గ్లాసులు, నూనె – 2 టీ స్పూన్స్, నెయ్యి – అర టీ స్పూన్, మెంతులు – 10 గింజలు ఇంకా ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్ అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత ఇంకా నిమ్మరసం – అర చెక్క తీసుకోవాలి.


ఈ కందికట్టు తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు కుక్కర్ లో కందిపప్పును తీసుకుని ఎర్రగా అయ్యే దాకా వేయించాలి.ఆ తరువాత అందులో నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తరువాత 4 నుండి 5 గ్లాసుల నీళ్లు, ఇంకా కొద్దిగా పసుపు వేసి కలపాలి.ఆ తరువాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే దాకా ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి.ఆ తరువాత పప్పుపై ఉండే నీటిని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకుని ఆ పప్పును పక్కకు ఉంచాలి. ఇక ఇప్పుడు పప్పును ఉడికించిన నీటిలో నిమ్మరసం ఇంకా ఉప్పు వేసి కలపాలి.ఇప్పుడు కళాయిలో నూనె అలాగే నెయ్యి వేసి వేడి చేయాలి.


నూనె వేడయ్యాక మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలపాలి. ఆ తాళింపు వేగిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పప్పు నీటిని పోసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే కందికట్టు తయారవుతుంది. ఇక దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లోనే కూరగాయలు లేనప్పుడు ఇలా కంది కట్టును తయారు చేసుకుని తినవచ్చు. ఇక ఈ కందికట్టు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది కనుక దీనిని అందరూ చాలా ఇష్టంగా తింటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: