కావాల్సిన పదార్థాలు:
బీట్రూట్ 1 , బంగాళదుంపలు రెండు, క్యారెట్ ఒకటి, ఉల్లిపాయ, పరిచిమిర్చి, పసుపు, ఉప్పు తగినంత, కరివేపాకు, నూనె, బియ్యపు పిండి ఒక కప్పు, మైదాపిండి ఒక కప్పు.
స్టెప్:
1. ఒక పాత్రలో బీట్రూట్ అండ్ బంగాళదుంప మరియు క్యారెట్ వేసి నీళ్లు పోసి ఉడికించాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి.
2. బంగాళదుంపలు అండ్ బీట్రూట్ ఉడికాక ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి రుబ్బాలి
3. ఈ పేస్ట్ లో కొంచెం మిర్చి పేస్ట్, పసుపు, ఆవాలు, కరివేపాకు వేసి బాగా కలపాలి.
4. ఈ మిశ్రమంలో బియ్యపు పిండి అండ్ మైదాపిండి, ఉప్పు వేసి మరోసారి కలపాలి.
5. ఓ పావు గంట పాటు ఉంచిన అనంతరం అందులో ఉల్లిపాయ అండ్ కొత్తిమీర వేసుకోవాలి.
6. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని కొంచెం నూనె వేసి వేడి చేయాలి.
7. వేడెక్కిన అనంతరం పిండిని దోస రూపంలో పెనంపై వేసుకోవాలి.
8. ఇక అనంతరం ఏదైనా చట్నీ తో సర్వ్ చేసుకుని ఈ బీట్రూట్ దోసని ఆస్వాదించండి.