భారత పొరుగు దేశం బంగ్లాదేశ్ లో హిందువులపై మొదలైన హింస, దౌర్జన్యాలు ఆగే సూచనలు కనిపించడం లేదు.  ఇటీవల బంగ్లాదేశ్ లో రాజ్ షాహి ప్రాంతంలో రాత్రి చీకటిలో ఒక వ్యక్తి ఆలయాన్ని కూల్చేందుకు యత్నించారు. ఈ వ్యక్తి పేరు బస్పి హుస్సేన్.



ఇతను రాత్రి సమయంలో ఆలయాన్ని పగుల కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సమయంలో శబ్ధం రావడంతో ప్రజలు మేల్కొని అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రజలు వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా.. సైన్యం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. స్థానిక ప్రజలు అతడిని సైన్యానికి అప్పగించారు.


అక్కడి స్థానిక ప్రజలు ముస్లి వర్గానికి చెందిన వారు నిందితుడిని తాడుతో కట్టేశారు. ఇది అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నమన స్థానిక ముస్లిం సమాజం కూడా పేర్కొంది. ఇది ఆగస్టు 23న  ఉదయం జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం నిందితుడిని ఆర్మీ పోలీసులకు అప్పగించారు.


రిజర్వేషన్లకు సంబంధించి గత నెల నుంచి ఉద్యమం జరగుతోంది. ఇది కాస్తా దేశంలో తిరుగుబాటుకు కారణం అయింది. నిజానికి ఆగస్టు 5న ప్రజలు కర్ప్యూ ను ఉల్లంఘించి వీధుల్లోకి రావడంతో ఉద్యమం ఎంతగా ఉగ్రరూపం దాల్చిందంటే.. 15 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది.


ఆగస్టు 5న దేశంలో జరిగిన హింసాత్మక ఉద్యమంలో దేశంలోని మైనార్టీ వర్గాలపై అనేక అరాచక మూకలు దాడి చేయడం, హిందూ మతానికి చెందిన వ్యక్తులు ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు కొన్ని ఇళ్లకు నిప్పు కూడా పెట్టడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అంతే కాకుండా హిందూ సమాజానికి చెందిన వ్యక్తుల వ్యాపారాన్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నించారు. వారి గోదాంకు నిప్పు పెట్టారు. అయితే దేశంలో పరిపాలన చట్టాన్ని తిరిగి స్థాపించడానికి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మహ్మద్ యూసఫ్‌ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: