ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలీగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ తర్వాత ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ గా దీనికి పేరుంది. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా ఈ మేసేజింగ్ యాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పావెల్ దూరెవ్ అరెస్టు అయ్యారు. పారిస్ లో ఉన్న బోర్గెడ్ విమానాశ్రయంలో పోలీసులు పావెల్ ని అదుపులోకి తీసుకున్నారు.


అవును.. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలీగ్రాఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. యాప్ కు సంబంధించిన నేరాల విషయంలో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అతని అరెస్టు కు సంబంధించి కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. ఈ మేరకు పలు కథనాలు వైరల్ అవుతున్నాయి.


కథనాల ప్రకారం.. పావెల్ ను టెలీగ్రామ్ యాప్ కు సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. టెలీగ్రామల్ లో మోడరేటర్ల లేరన్న విషయంపైనే ఫ్రెంచ్ పోలీసులు తమ దర్యాప్తు కేంద్రీకరించినట్లు చెబుతున్నారు. ఇలా మోడరేటర్ల లేకపోవడం వల్ల మెసేజింగ్ యాప్ లో నేర కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.


మరోపక్క మోసం, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. ఈ అరెస్టు వ్యవహారంపై టెలీగ్రామ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని తెలుస్తోంది. ఇదే క్రమంలో.. అటు పోలీసులు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


కాగా.. 2022లో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పటి నుంచి యుద్ధం చుట్టూ నెలకొన్న రాజకీయాలకు టెలీగ్రామ్‌ వేదికగా పెద్ద ఎత్తున ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలన్ స్కీ తన అధికారులకు ఈ టెలీగ్రామ్ అత్యంత ప్రధానమైన కమ్యూనికేషన్ మాధ్యమని చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ceo