ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా డయాబెటిస్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నా. వృద్ధులు కంటే యంగ్ గా ఉన్న వారికే వస్తుంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డయాబెటిస్ బాధితులు పెరిగిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో ప్రతికూల మార్పులు, మానసిక ఒత్తిళ్లు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి మధుమేహం బారిన పడుతున్నారు.

క్రమంగా ఈ పరిస్థితి డయాబెటిస్ పే షెంట్లలో క్రమంగా ఊబకాయం, మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బులు వంటివి సమస్యలకు దారి తీయవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఫైబర్ కంటెంట్ కలిగిన ఆహారాలు, గైసేవింక్ ఇండెక్స తక్కువగా ఉండే పానీయాలు డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచడంలో సహాయపడతాయి. అలాంటి వాటిలో కాకరకాయ జ్యూస్ కూడా కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 ఘగర్ పే షెంట్లకు ఇది ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కాకరకాయలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని పాలీపె ప్టైడ్-పి లేదా పి- ఇన్సులిన్ అనే సమ్మేళనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కాకరకాయను ఆహారంలో భాగంగా తినటం, ముఖ్యంగా దీనిని జ్యూస్ తయారు చేసుకునే తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ శోషణను మీ అంతరించటంలో కాకరకాయ జ్యూస్ సహాయపడుతుంది. దీనిని తాగటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటి మెరుగుపడుతుందని ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్ ట్వంటీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డైటరి ఫైబర్ కారణంగా కాకరకాయ జ్యూస్ అధిక బరువు సమస్యను కూడా నివారిస్తుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లకు ఇది చాలా ముఖ్యం అని చెప్పారు. పైగా ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. తద్వారా ఒబిసిటీని నివారించటంలో, ఇన్సులిన్ సెన్సిటివిటిని మెరుగు పరచటంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: