మెగాస్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధర్మతేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సాయిధర్మతేజ్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. సాయిధర్మతేజ్ రీసెంట్గా. విరూపాక్ష మూవీలో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును కూడా అందుకుంది. మరి ఆ తర్వాత బ్రో మూవీలో బిజీగా ఉన్నాడు సాయిధరమ్ తేజ్. పవన్ కళ్యాణ్ సరసను నటించాడు సాయిధరమ్ తేజ్. వరదల కారణంగా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు జల ప్రళయంలో చిక్కుకున్నాయి. ఈ వరద భీభర్యం కారణంగా ఎంతో ఆస్థి నష్టంతో పాటు..

ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ క్రమంలోనే వరద బాధితులకు సహాయంగా ఇప్పటికే పలువురు సినీ నటులు తమ వంతు సహాయం చేశారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ మొత్తాన్ని విరాళంగా అందించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో కోటి చొప్పున రెండు కోట్లు విరాళంగా అందించిన పవన్ కళ్యాణ్..తాజాగా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముప్పు బారిన పడ్డ 400 పంచాయితీలకు..ఒక్కొ పంచాయితీకి రూ.1 లక్ష చప్పున మొత్తం రూ.4 కోట్లు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు.

 దీంతో మొత్తంగా ఆయన చేసిన సాయం రూ.6 కోట్లకు చేరింది. ఇక మెగాస్టార్ చిరంజీవి కోటి, రామ్ చరణ్ కోటి అందించగా..తాజాగా మరో మెగా హీరో విరాళం అందించాడు. ఆయన మరెవరో కాదు సాయి ధర్మతేజ్. ఈమెరకు ఆయన 'x' ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ..'రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు..అదే విధంగా విజయవాడలో నేను మన మెగా అభిమానులు, జన సైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమంతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు 5 లక్షలు.(మొత్తం 25 లక్షలు) నా వంతు విరాళంగా అందించాను. ఈ కష్టాలని త్వరగా తగ్గిపోవాలి అని దేవుడిని నమస్కరించుకున్నాను..మీ సాయి ధర్మ తేజ్' అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: