మెగాస్టార్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నిహారిక రీసెంట్గా ఒక సినిమా డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు "కమిటీ కుర్రోళ్ళు" అన్నా సంగతి తెలిసింది. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును కూడా అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్లు ప్రాంతాలు జలమయం అయిన విషయం తెలిసింది. ముఖ్యంగా ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మంలో పలు ప్రాంతాలు నీట మునిగి ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి. అయితే చాలామంది ఆహారం, నీరు అందగా నానా తంటాలు పడుతున్నారు.

 ఈ క్రమంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి బాధితులను అందుకుంటోంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ స్టార్స్ తమ వంతుగా కొంత డబ్బును సిఎం  సహాయనిధికి అందజేశారు. ఈ క్రమంలో మెగా డాటర్ నిహారిక కూడా విరాళం ఇచ్చింది. "విజయవాడలోని రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు ఇబ్బందులు పడుతుండడం నాకు చాలా బాధ కలింగించింది. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రాంత ప్రజలే.

 నేను పుట్టి పెరిగిన వాతావరణం అంతా నగరంలోనే అయినా మా పెద్దవారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కాబట్టి వారు చెప్పే అనుభవాలు విన్న దృష్టి నాకు గ్రామీణ వాతావరణం పై ఎంతో అభిమానం ఉంది. ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా బాబాయ్ పవన్ కల్యాణ్ తో పాటు మా కుటుంబీకులు అందరూ బాధితులకు అండగా నిలబడటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.నేను కూడా వరద ముప్పుకు గురైన ఒక పది గ్రామాలకు ఒక్కొ గ్రామానికి ఏభై వేలు చొప్పున ఐదు లక్షలు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను" అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా..నిహారికను ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: