ఈ రోజుల్లో ప్రోటీన్ ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. మరి ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీ ఫెయిల్ అవ్వటం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. మన శరీరంలో కిడ్నీలు ఎంత ముఖ్యమైనవో మనందరికీ తెలిసిందే. బేసిగ్గా మూత్రపిండాలు ఫిల్టర్ లాగా పని చేస్తూ మన శరీరంలో ఉన్న వ్యార్ధ పదార్థాలను మాత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అలా కానీ యెడల శరీరంలో టాక్సిన్స్ ఉండిపోయి చాలా రకాల వ్యాధులు రావటం మొదలవుతాయి.

అందుకే..కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఇందుకోసం మన రోజు వారి భాగంలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాలని వాయిద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా..ఆహారంతో పాటు..కొన్ని విషయాలను రెగ్యులర్ గా పాటించాలి అని అంటున్నారు. మరి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనం ఎలాంటి విషయాలు అలవాటు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రెండు కిడ్నీలలో ఏదైనా ఒకటి పని చేయకపోవడం వల్ల శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ హెచ్చరిక సంకేతాలను ఎలా గుర్తించాలో ముందుగా తెలుసుకుందాం. ఫస్ట్ ఫాల్ బరువు పెరగటం అనేది మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు.

ఎందుకంటే ఇది మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటుకు కారణంమవుతుంది. దానివల్ల కిడ్నీలు కూడా చాలా దెబ్బతింటాయి. మీరు రోజు నిద్ర పోవడం-లేవటం అనే సమయాన్ని ఒకేలా ఉండేలా సరి చేసుకోండి..దాన్ని ఎక్కువగా మార్చవద్దు. అలాగే ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. దీనివల్ల మూత్రపిండాల ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. అలాగే రోజుకు కనీసం నాలుగు లీటర్లు నీరు తాగటం చాలా ముఖ్యం..సరిపడా నీళ్లు తాగటం వల్ల హైడ్రేషన్ గా ఉండటంతో పాటు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. మీరు రోజుకు అరగంట పాటు వ్యాయామం లేదా మరేదైనా శరీరక శ్రమ చేస్తే, మీ రక్తపోటు బాగా నియంత్రణలో ఉంటుంది. దీంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: