పిల్లలకి దగ్గు జలుబు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దగ్గు వచ్చినప్పుడు పిల్లలకి ఈ కాయను పెట్టటం వల్ల వెంటనే తగ్గుతుంది. దగ్గు వచ్చినప్పుడు జాజికాయ ను కొంచెం నూరి బుగ్గన పెడితే దగ్గు అనేది వెంటనే తగ్గుతుంది. చాలామందికి దగ్గు వచ్చినా ఎన్ని టాబ్లెట్లు వేసుకున్న కానీ అసలు తగ్గదు. ఈ కాయను నోట్లో పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. శిశువులకు, చిన్నపిల్లలకు ఏదైనా తినిపించటం చాలా కష్టమైన పని. పిల్లలు ఏదైనా త్వరగా తినటానికి సిద్ధంగా ఉండరు. అందుకే ఈ నాటి కాలంలోని పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురయ్యే వాతావరణం కూడా ఉంది.

ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి చాలా సాధారణం. పిల్లలకు దగ్గు మొదలైతే చాలా రోజుల పాటు అలాగే కొనసాగుతుంది. ఉపశమనం పొందాలంటే ఏ మందు ఇవ్వాలో అర్థం కాకుండా ఉంటుంది. అయితే ఎక్కువ మందులు, దగ్గు సిరప్ ఇవ్వటానికి బదులుగా, మీరు ఇంటి నివారణలతో పిల్లల దగ్గు, జలుబును నయం చేయవచ్చు. మరి ఇంతకీ అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జాజికాయ ఆహారపు రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది జాషధాల తయారీకి కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు.

అలాగే పిల్లలకు కూడా జాజికాయ ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందుకే పిల్లలకు దగ్గు ఉన్నప్పుడు చిటికెడు జాజికాయను తినిపిస్తే వారు దగ్గు, జలుబు నుంచి ఉపశ్రమమం పొందగలరు. ఇది వారి రోగనిరోధక శక్తిని  కూడా పెంచుతుంది. శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ పిల్లలకు చిటికెడు జాజికాయను నొక్కడం ద్వారా వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. ఈ మసాలాలో జీర్ణ ఎంజైమ్ లు ఉంటాయి. ఇది శిశువు చిరున వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పిల్లలు తరచుగా కడుపునొప్పి, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు. ఒక చిటికెడు జాజికాయ పొడిని తేనెలో కలుపుకుని తాగితే కడుపు నొప్పి, గ్యాస్ సమస్యల నుంచి ఉపశ్రమణం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: