పిల్లలకు జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుంది. ఏది చెప్పినా కానీ వాళ్ళకి గుర్తు ఉండటం లేదు. జ్ఞాపక శక్తి పెరగాలంటే మనం ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కానీ పిల్లలు అటువంటివి అసలు తినరు. బయట ఫుడ్ కోసమే ఎక్కువగా చూస్తారు. జ్ఞాపకశక్తి తగ్గటం వల్ల చదువు అనేది కూడా తగ్గుతుంది. ఏం చదివినా ఒక్కొక్కసారి గుర్తు రాదు. మనుషుల్లో మతిమరుపు అనేది కామన్. మతిమరుపు అనేది మూడు రకాలు. యాంటీరోగ్రేడ్ స్కృతి, తిరోగమన స్మృతి, డిసోసియేటివ స్మృతి. స్ట్రెస్, ఆందోళ కారణంగా మానసిక ఆరోగ్యం పై ఎఫెక్ట్ చూపుతున్నాయి.

 కాగా దీన్ని ప్రభావం మెదడుపై చూపుతుంది. దీంతో జ్ఞాపకశక్తి వస్తుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టిన మర్చిపోతుంటారు. ఏదో పని చేయబోయే ఏమో పని చేస్తారు. ఎవరైనా ఏమైనా చెబితే... మరో వ్యక్తి మధ్యలో వచ్చి మాట్లాడగానే ఆ విషయాన్ని మర్చిపోతారు. అయితే ఈ ప్రాబ్లం కేవలం పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఎదుర్కొంటున్నారు. పిల్లలు కూడా ప్రస్తుతం రోజుల్లో ఒత్తిడికి గురవుతున్నారు. చిన్నచిన్న విషయాలకే ఆందోళన చెందుతున్నారు. దీంతో స్టుడి పై దృష్టి సరించలేకపోతున్నారు. చదివిన విషయాలు మర్చిపోతున్నారు. సబ్జెక్ట్ గుర్తుంచుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు. కాగా పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలంటే పేరెంట్స్ వారికి ఈ పనులు అలవాటు చేయండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

 ప్రతిరోజు పిల్లలతో కనీసం 10 నిమిషాలు అయినా ధ్యాయం చేయించండి. దీంతో మనసు తెలిక అయిపోతుంది. జ్ఞాపక శక్తిని పెంచడంలో వ్యాయామం సూపర్ గా పని చేస్తుంది. కేవలం బాడినే కాకుండా మనసు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే యోగా, స్కిప్పింగ్, సైక్లింగ్ వంటివి కూడా పిల్లలతో చేయించండి. సుడోకు, పజిల్ సాల్వింగ్, చెస్ వంటి ఆటలు ఆడించండి. సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. క్రమశిక్షణ అనేది పిల్లలకు చాలా అవసరం. కాగా పిల్లలు క్రమశిక్షణగా ఉండాలంటే టైమింగ్ సెన్స్ అనేది చాలా అవసరం. ఒక పనిని చేయాల్సిన సమయానికి చేసినటైయితే  పిల్లలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో చదువుపై ఇంట్రెస్ట్ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: