భారతదేశంలో సాంప్రదాయంగా శ్రీమంతాన్ని జరిపిస్తారన్న సంగతి తెలిసింది. గర్భిణీ స్త్రీలకు 8 నెల వచ్చాక ఈ శ్రీమంతం వేడుకను జరిపిస్తారు. కొంతమంది అంగరంగ వైభవంగా ఈ వేడుకను జరిపిస్తారు. శ్రీమంతంలో మహిళకు గాజులు వేసి సాంప్రదాయంగా చేస్తారు. శ్రీమంతం రోజున మహిళలకు గాజులు వేసే సాంప్రదాయం తరతరాలుగా వస్తున్నా సంగతి తెలిసిందే. అలాగే ఆడవాళ్లు పెళ్లిళ్లలో నిశ్చితార్థం వేడుకలో, పూజలలో పాల్గొన్నప్పుడు ఆడవాళ్లు చేతినిండా గాజులు వేసుకుని కనిపిస్తారు. పండుగల కైతే మహిళలు పట్టు చీరలు కట్టుకుని, జడలో పువ్వులు, చేతినిండా గాజులతో ఎక్కువగా కనిపిస్తుంటారు.

ఎలా ప్రతి వేడుకలో మహిళలు గాజులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే చాలామంది గాజులు వేసుకోవటం అలంకరణగా భావిస్తారు. అందంగా కనిపించడం కోసం వేసుకుంటున్నామని అనుకుంటారు. కానీ దాని వెనుక ఒక సైంటిఫిక్ రీసన్ ఉంది. శ్రీమంతం రోజునే కాకుండా ఇలా ప్రతి కార్యక్రమానికి మహిళలు చేతులకు గాజులు వేసుకోవడానికి.. దీని వెనుకున్న రహస్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అయితే చేతి మణికట్టు వద్ద గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి. కాగా ఈ నాడులపై గాజుల ఒత్తిడి పడుతుంది. దీంతో ప్రెగ్నెన్సీ మహిళలు సోక ప్రసవం అవుతారని అంటారు.

 అలాగే వినసొంపుగా ఉంటుంది. గాజుల సౌండ్ కు కడుపులో ఉన్న బేబీ మెదడులోని కణజాలం వృద్ధి చెందుతుంది. ఈ శబ్దం వల్ల ప్రెగ్నెన్సీ మహిళలకు స్ట్రెస్ నుంచి ఉపశ్రమమం కలిగిస్తుంది. చేతికున్న గాజులు చూసుకున్నప్పుడల్లా మురిసిపోతుంటారు. గర్భవతులు వత్తిడితో డెలివరీ అయితే పుట్టిన బేబీ వెయిట్ చాలా తక్కువగా ఉంటుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. కాగా గాజుల వల్ల ఈ సమస్యకు చెక్కు పెట్టవచ్చు. అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. బీపీలు, గుండె సమస్యలు రావు. గాజులు వేసుకోవటం వల్ల మహిళలు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి మహిళలు గాజులని తప్పకుండా వేసుకోండి. ఈ కారణాల వల్ల గాజులను వేసుకోవటం మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: