వర్షంలో ఎక్కువగా తడవటం వల్ల జలుబు, దగ్గు సమస్యలు వస్తూ ఉంటాయి. జలుబు దగ్గు వచ్చిన వెంటనే గొంతు నొప్పి కూడా ప్రారంభిస్తుంది. అందుకని ఎక్కువగా వర్షం లో తడవటం మంచిది కాదు. గొంతుకు జలుబు చేసినప్పుడు బొంగురుగా మాట వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు చాలా వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. నాన్ స్టాప్ గా తగ్గటం, ఊపిరి ఆడకపోవటం, వాంతులవ్వడం, మింగటంలో ఇబ్బంది పడడం, మూత్రంలో బ్లడ్ పడడం, ఆ జీర్ణం లేదా గుండెలో మంట, ఆకలి లేకపోవటం, సడన్ గా వెయిట్ లాస్ అవ్వటం, రాత్రులు ఎక్కువ చమట పట్టడం,

మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడటం, గొంతు నొప్పి పెట్టడం, ముక్కు నుంచి రక్తం కారటం వంటివి క్యాన్సర్ లక్షణాలు. ఈ క్యాన్సర్ 75 శాతం పొగాకు తీసుకునే వారిలో వస్తుందని నిపుణులు గుర్తించారు. అలాగే అధిక బరువు ఉన్నవారికి, అధికంగా మద్యం తీసుకోవడం వల్ల, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల కారణంగా క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు. అయితే ఒక నెలరోజుల పాటు గొంతు నొప్పి, మాట్లాడుతుంటే బొంగురు లాగా అనిపిస్తే మాత్రం ఇది స్వరపేటిక క్యాన్సర్ కు దారి తీయవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 ప్రతి సంవత్సరం లక్షకు పైగా క్యాన్సర్ బారిన పడుతున్నారని... కాగా ముందుగానే క్యాన్సర్ లక్షణాలని గుర్తించి వైద్యల్ని సాంప్రదించాలని నిపుణులు జనాలకు సూచిస్తున్నారు. స్వరపేటిక క్యాన్సర్ వచ్చిన వారు తీవ్రమైన అలసటకు గురవుతారు. విపరీతంగా గొంతు నొప్పి ఏర్పడుతుంది. నాన్ స్టాప్ గా దగ్గుతూనే ఉంటారు. మాట సరిగ్గా రాదు. బొంగురుగా వస్తుంది. మాట్లాడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటికి తోడుగా చెవి నొప్పి వస్తుంది. ఊపిరి పీల్చుకున్నప్పుడు గురక కూడా వస్తుంది. అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. ఈ సర్వపేటిక క్యాన్సర్ ఎక్కువగా 60 ఏళ్ళ పైబడిన వారిలోనే వస్తుంది. అందులో ఆడవాళ్ళలో కంటే పురుషులలో ఎక్కువగా వస్తుంది. కాగా దీన్ని తొందరగా గుర్తిస్తే వ్యాధి నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: