చాలామంది ఏం తోచని సమయంలో వంటరిగా కూర్చుంటారు. ఉన్నట్టుండి మూడు మారిపోతుందా?... ఏమి తోచని అయోమయంలో ఊరుకుపోతున్నారా? ఆందోళనగా అనిపిస్తుందా?, రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? అయితే మీ శరీరంలో ఏదో జరుగుతున్నట్లే లెక్క. ముఖ్యంగా ఐదు రకాల విటమిన్లు లోపిస్తే ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. శరీరంలో విటమిన్ బి9 లేదా ఫోలేట్ లోపం ఉన్నట్లయితే అయోమయంగా, ఆందోళనగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది కొత్త కణాల నిర్మాణానికి ఆటంకం కల్పిస్తుంది. ఫలితంగా అలసట, నిరాశ, నిస్పృహ, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 ఏకాగ్రతలోపిస్తుంది. సడన్ గా మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. బయటపడాలంటే తరచుగా ఆకుకూరలు, పండ్లు, తృణ ధాన్యాలు వంటి ఫోలేట్ పరిమాణం అధికంగా ఉండే ఆహారాలు తగినంతగా తీసుకుంటూ ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరంలోన్ ఐరన్ లోపం ఉంటే ప్రవర్తనలో అయోమయం నెలకొంటుంది. హిమోగ్లోబిన్ తయారీలో శరీరానికి ఐరన్ చాలా ముఖ్యం. ఇది లోపిస్తే ఎనిమియా వంటి రక్త హీనత వ్యాధులు వస్తాయి. దీంతో శరీరంలోని అవయవాలకు రక్తం సరిగ్గా సరఫరా కాదు. ఫలితంగా నీరసం, తీవ్రమైన అలసట, కళ్లు, తల తిరగటం వంటివి సమస్యలు సంభవిస్తుంటాయి.

ఆకుకూరలు, గుడ్డు, మాంసం వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. శరీరంలో విటమిన్ డి లోపం కూడా అలసట, అయోమయానికి, మానసిక సమస్యలకు దారితీస్తుంది. కాల్షియం అది సరిగ్గా ఉన్నప్పుడే సరైన శక్తి లభిస్తుంది. లేకుంటే కండరాలు, ఎముకల బలహీనత ఏర్పడుతుంది. సమస్య నుంచి బయటపడాలంటే రోజు కాసేపు ఉదయపు ఎండలో నిలబడాలి. ఇలా చేస్తే విటమిన్ డిని శరీరం సహజంగానే పొందుతుంది. దీంతో పాటు ఫ్యాటి చేపలు, గుడ్లు, వంటివి తినాలి. ఈ విటమిన్ లోపిస్తే నరాల బలహీనత, నీరసం, అలసట, తలనొప్పి వేధిస్తాయి. మానసిక పరిస్థితిలో మార్పులు రావచ్చు. నిజానికి విటమిన్ బి 12 శరీరానికి చాలా ముఖ్యం. ఇది రక్తనాళాలను, కణాలను ఉత్తేజ పరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: