వర్షం పడ్డాక తడిచిన మట్టి మంచి సువాసనను కలిగిస్తుంది. ఆ వాసనను చూస్తే తినాలని అనిపిస్తుంది. పల్లెటూరులో మట్టి వాసన మరింత బాగుంటుంది. సిటీలో మట్టి వాసనే అసలు రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సిమెంట్ చేసేసి ఉంచుకుంటారు. మట్టి ఉన్న ప్లేసే ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ మరి పల్లెటూరులో వచ్చినంత వాసన రాదు. ఎండలు కాసి కాసి గట్టిపడ్డ మట్టి పెళ్లల పై తొలకరి చినుకులు పడగానే వెదజల్లే సువాసనలను మీరెప్పుడైనా ఆస్వాదించారా? మన్నులో అలాంటి పరిమళాలు ఎందుకు వీస్తాయని అనుమానం కలిగించిందా?

 ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు 1960 కంటే ముందు నుంచే పరిశోధనలు కొనసాగించారు. చివరకు అసలు విషయాన్ని కనుగొన్నారు. అయితే ఆకట్టుకునే ఆ స్మెల్ కు పెట్రికోర్ అనే పేరు కూడా పెట్టారు. మట్టిలో ఉండే స్ట్రెప్టోమైసెన్ అని బ్యాక్టీరియా విడుదల చేసే జియోస్మిన్ అనే రసాయన సమ్మేళనాల కారణంగా మట్టిలో ఈ విధమైన సువాసన వస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్వచ్ఛమైన మట్టిలో సువాసనలతో పాటు మానవాళికి మేలు చేసే పలు బ్యాక్టీరియాలు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

మన దేశంలో అయితే పరిమళాలు వెదజల్లే మట్టిని సేకరించి అత్తర్ల తయారులోనూ వినియోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని కన్నేజ్ లో వీటిని తయారు చేస్తున్నారు. అంతేకాకుండా మట్టిలో సువాసనకు కారణమయ్యే స్ట్రెప్టోమైసెస్ బ్యాక్టీరియాను యాంటీ బయోటిక్ మందుల తయారీలోనూ వాడుతుంటారని నిపుణులు చెప్తున్నారు. కాగా అరుదుగా కొందరు మట్టిలో వచ్చే సువాసనకు అట్రాక్ట్ అయి రుచి చూడాలని కూడా అనుకుంటారు. కానీ మట్టిని తినటం మాత్రం అస్సలు మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మట్టి వాసన పీల్చటానికి చాలా సువాసనగా ఉంటుంది. అలా అని మట్టిని అసలు తినకూడదు. మట్టిని తినటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వల్ల బ్యాక్టీరియా అనేది ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: