చాలామంది ఖర్జూరాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. ఖర్జూరం తినటం వల్ల ఆరోగ్యానికి మంచిదే. కానీ మరీ ఎక్కువగా తింటే వేడి చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని రోజుకు 6 లేదా 7 తింటే సరిపోతుంది. ఖర్జూరం రాత్రి నానబెట్టుకుని ఉదయం తింటే ఇంకా మంచిది. ఖర్జూరంలో ఎన్నో పోషకాలు కలిగి ఉంటుంది. ఖర్జూరం ఎక్కువ ఆదరణ పొందిన డ్రై ఫ్రూట్స్ లో ప్రథమ స్థానంలో ఉంటుంది. 30 రోజులు క్రమం తప్పకుండా ఖర్జూరాన్ని తింటే ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. అవేంటో చూద్దాం. ఖర్జూరంలో పోషకాలు మెరుగ్గా ఉంటాయి.

ఇవి శరీరంలో శక్తిని పెంచుతాయి, గుండె, మెదడు కు మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. నువ్వు ఖర్జూరాన్ని తింటుంటే రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. ఖర్జూరంలో సహజమైన గ్లూకోస్ , ఫ్రక్టోజ్ ఉంటాయి. నీవే శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఖర్జూరం లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. మలబద్ధకంను నివారించటంలో కూడా సహాయపడుతుంది. ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి.

కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఖర్జూరం తింటే ఎముకలు బలపడతాయి. ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ మెరుగుగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెంచాడానికి, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకని ఖర్జూరాన్ని తప్పకుండా తినండి. ఖర్జూరంలో ఉండే పోషకాలు అంతా ఇంతా కాదు. ఎంతో మేలు చేసే పోషకాలు ఉంటాయి. ఖర్జూరం తినటం వల్ల గుండె సమస్య నుంచి బయటపడవచ్చు. మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నవారు ఖర్జూరాన్ని తప్పకుండా తినండి. అలా అని మరీ ఎక్కువగా కూడా ఖర్జూరాన్ని తినకండి. రోజుకి తగినంత మాత్రమే తినటం ఉత్తమం. ఖర్జూరంలో మెగ్నీషియం, పొటాషియం లాంటి ఫైబర్స్ ఉంటాయి. దీనిని తినటం ఆరోగ్యానికి మంచిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: