ఈరోజుల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా బ్రెయిన్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ బ్రెయిన్ క్యాన్సర్ రావటం వల్ల మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. 2020లో 1 కోటి మందికి పైగా ప్రజలు క్యాన్సర్ కారణంగా మరణించారు. వీటిలో అత్యంత సాధారణమైనవి రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్. చాలామంది వీటి బారిన పడి అవస్థలు పడుతుంటారు. క్యాన్సర్ కణాలను ఆలస్యంగా గుర్తించటం కూడా చికిత్సను ఆలస్యం చేసి, మరణానికి దారితీస్తుంది.

వాటిలో ఒకటి మెదడు క్యాన్సర్, ఇది అత్యంత ప్రమాదకరం. అందుకే ఈ క్యాన్సర్ ని ప్రారంభ దశంలోనే గుర్తించడం చాలా ముఖ్యం. మరి ఈ క్యాన్సర్ లక్షణాలు ఏంటి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మెదడు క్యాన్సర్ లక్షణాలు అనేక రకాలుగా ఉండవచ్చు. కానీ చాలా సాధారణ లక్షణాలు అవి ఏంటంటే తలనొప్పి, ఇది ఉదయం ఎక్కువగా వస్తుంటుంది. ఇతర లక్షణాలు వాంతులు, నువ్వు మందగించడం, నడవడానికి, మాట్లాడడానికి ఇబ్బంది, శరీరం ఒక సగం తిమ్మిరి ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

 ఈ లక్షణాలు మహిళలలో ఎక్కువగా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వారిలో కూడా మెదడు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయి. దీని నివారణ సాధ్యమే. ఇది ప్రధానంగా కణితి పరిమాణం, స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ ద్వారా కణితిని తొలగించగలిగితే మంచిది. లేకపోతే రేడియేషన్ థెరపి, కెమోథెరపి, ఇతర రకాల వైద్యం అందిస్తారు. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. క్యాన్సర్ లక్షణాలు ఈజీగా కనిపెట్టవచ్చు. వైద్యులను సంప్రదించి దానికి సంబంధించిన మందులు వాడటం మంచిది. ఈ క్యాన్సర్ లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. రకరకాలు క్యాన్సర్లు ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: