ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ వివాహం చేసుకున్న వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ విడాకులకే రెడీ అయిపోతున్నారు. వివాహం అనేది చాలా పవిత్రమైన బంధం. ఈ బంధంతో అబ్బాయి, అమ్మాయి జీవితాంతం కలిసి జీవించాలని, ఒక కుటుంబాన్ని ప్రారంభించాలని వాగ్దానం చేసుకుంటారు. కొన్ని వివాహ బంధాలలో సమస్యలను ఎదుర్కొన్న తర్వాత, జంటలు విడాకులు తీసుకుంటున్నారు. విడాకులతో ఇద్దరూ విడిపోతారు. అయితే ఇండోనేషియాలో  ప్లెజర మ్యాజిక్ అనే ఆచారం నడుస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఈ ఆచారం ఏమిటి అనుకుంటున్నారా.. ఏం లేదండి ఇక్కడ సెలవులకు వచ్చే పర్యాటకులు వివాహం చేసుకుని విడాకులు తీసుకుంటారు.

ఈ వివాహం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తూర్పు ఇండోనేషియాలో పూనక్ అనే ప్రదేశం పర్యాటకులకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇది కొండ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రజలు చాలా ఇష్టపడతారు. చాలామంది అరబ్బులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశంలో కోట బుంగా అనే పర్వత నిసార్ట్ ఉంది. ఇక్కడ మగాం పర్యాటకులు స్థానిక, యువతులకు ఏజెన్సీల ద్వారా పరిచయం చేస్తారు. తర్వాత మగ పర్యాటకుడు,  స్త్రి మధ్య ప్లెజర్ మ్యారేజ్ ఏర్పాటు చేశారు. ఈ స్వల్పకాలిక వివాహం కోసం, పర్యాటకులు స్థానిక మహిళలకు డబ్బు చెల్లిస్తారు. వారిని పెయిడ్ వధువులు అని పిలుస్తారు.

 ఆ తరువాత చిన్నప్పటి వేడుకలు ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. ఈ వివాహం స్వల్పకాలికమైనందున, ఇది పర్యాటకుడు దేశంలో ఉండే వరకు మాత్రమే ఉంటుంది. పర్యాటకుడు దేశం విడిచి పెట్టిన తరువాత, ఇద్దరూ విడాకులు తీసుకుంటారు. లాస్ ఏంజిల్స్ టైమ్ లోని ఒక నివేదిక ప్రకారం ఈ వివాహాన్ని ఆనంద వివాహం అని పిలుస్తారు. ఈ వివాహం వల్ల ఒకవైపు పర్యాటకం ఊపందుకోగా, మరోవైపు ఆర్థిక వ్యవస్థలో కూడా వృద్ధి కనిపిస్తోంది. ఇంతకు ముందు కుటుంబాలు ఈ పద్ధతి కోసం అమ్మాయిలను పర్యాటకలకు పరిచయం చేసేవి, కానీ ఇప్పుడు దీనికోసం ఏజెన్సీలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: