మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు.దాదాపు 30 ఏళ్లపాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు.ఇదిలావుండగా  సీఎం చంద్రబాబు నాయుడుని టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కలిశారు. శనివారంహైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో మీట్ అయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే.దీంతో వరద బాధితుల సహాయార్థం తనయుడు రామ్ చరణ్తో కలిసి చిరంజీవి రూ.కోటి ప్రకటించారు. ఇప్పుడు ఆ విరాళం చెక్ను చంద్రబాబుకు అందించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల తరఫున చిరంజీవి, రామ్ చరణ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అయితే బాబుతో భేటీ సమయంలో మెగాస్టార్ డ్రెస్సింగ్ సెన్స్, ఆయన తొడుక్కున్న చెప్పులు ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. బ్లూ జీన్స్- బ్లాక్ షర్ట్ లో సింపుల్ గా కనిపించిన చిరు ఫ్యాషన్ సెన్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆయన కాలికి ఉన్న చెప్పులను చూడగానే స్టన్నయిపోయారంతా. ఇవి అత్యంత ఖరీదైన, పాపులర్ అంతర్జాతీయ బ్రాండ్ గూచీ కంపెనీవి. వీటి ఖరీదు సుమారు 2 లక్షల వరకూ ఉంటుందని అంచనా. దాదాపు 3000 అమెరికన్ డాలర్లకు పైగానే ధర ఉంటుందని, అదనంగా ట్యాక్స్ కూడా చెల్లించాలని ఆన్ లైన్ వెల్లడిస్తోంది. అయితే ఇవి చెప్పులేనా లేక షూస్ అని పిలవాలా? అంటే వీటిని నిజానికి మ్యూల్స్ అని పిలుస్తారు. ముందుకు చూస్తే షూలా కనిపించినా కానీ ఇవి చెప్పులే. వెనక భాగంలో సులువుగా ధరించే విధంగా ఉంటాయి. ఈ తరహా మ్యూల్స్ ఇప్పుడు యూత్ లో ట్రెండ్ గా మారాయి. ఇక 60ప్లస్ లోను మెగాస్టార్ నవయువకుడిలా మురిపిస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న `విశ్వంభర`లోను ఆయన యంగ్ లుక్ తో కనిపించనున్నారు. ఇక చిరంజీవి తాజాగా నటిస్తోన్న చిత్రం 'విశ్వంభర'. దసరా పండుగ నాడు మెగా అభిమానులకు చిరంజీవి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. 'విశ్వంభర' టీజర్ పండుగ సందర్భంగా శనివారం విడుదల చేశారు. 1.33 నిమిషాల నిడివి గల ఈ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇదిలా ఉంటే ఓ హీరో కారణంగా చిరంజీవి ఎన్నో నిద్రలేని గడిపారట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే ఓ ఇంటర్య్వూలో తెలిపారు.ఆ హీరో మరెవ్వరో కాదు లోక నాయకుడు కమల్ హాసన్. కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం అప్పట్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిగా విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: