చాలామంది ఉదయం పాలు ఎక్కువగా తాగుతారు. ఉదయం ఒక కప్పు పాలు తాగటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి తప్పకుండా పాలని ఉదయం తాగండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గ్లాస్ పాలు తాగాలని డైటిషియన్లు సూచిస్తుంటారు. ఎందుకంటే వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కాలుష్యం కలిగి ఉన్నందున ఎముకలు దృఢంగా తయారవుతాయి. అందుకే చిన్న పిల్లలు మొదలుకోని పెద్దల వరకు పాలను, వాటి ఉత్పత్తలను ఆహారంలో భాగంగా ఉపయోగించుకోవాలని పోషక ఆహార నిపుణులు అంటున్నారు.

 ఇకపోతే యూజ్ చేయడానికి ముందు పాలను కాసేపు వేడి చేయడం సహజమే. అయితే ప్యాకెట్ పాలను మాత్రం ఎక్కువ సేపు వేడి చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవులు, గేదెలా నుంచి పితికిన పాలను నేరుగా తీసుకొచ్చినప్పుడు వాటిని తప్పకుండా వేడి చేశాకే వాడాలి. అలా చెయ్యకుంటే అందులోని హానికారక బ్యాక్టీరియా చావదు. అయితే బయట మార్కెట్లో కొనే ప్యాకెట్ పాలను మాత్రం ఎక్కువసేపు మరిగించకూడదు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే వీటిని ఆల్రెడి పాశ్చరైజేషన్ చేశాకే ప్యాకింగ్ చేస్తారు.

 ముఖ్యంగా పచ్చి పాలలోని హానికారక బ్యాక్టీరియా నాశనం అయ్యేలా 71 డిగ్రీల సెల్సియర్స్ ఉష్ణోగ్రతలవద్ద మరిగించి తిరిగి 0 డిగ్రీల వద్ద చల్లబరుస్తారు. ఆ తరువాత ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తారు. ముందుగానే వేడి చేసి ప్యాక్ చేస్తారు కాబట్టి ప్యాకెట్ పాలలో అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియా ఆల్రెడి నాశనం అయి ఉంటుంది. కాబట్టి వాటిని ఉపయోగించే ముందు జస్ట్ గోరు వెచ్చగా వేడి చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు. అలా కాకుండా అధికంగా వేడిచేస్తే చేస్తే మాత్రం వాటిలోని విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్లు వంటి పోషకాలు నశిస్తాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్యాకెట్ పాలను అసలు తాగకండి. తాగినా సరే మరి ఎక్కువగా వేడి చేసాకండి. వేడి చేయటం వల్ల బ్యాక్టీరియా మరింతగా ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: