బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సీనియర్ యాంకర్ ఝాన్సీ ఒకరు ఈమె కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈమె యాంకర్ గా కొనసాగుతూ బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడమే కాకుండా మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ఇటు బుల్లితెరపై అటువంటి వెండి తెరపై ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ ఈమె పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నటువంటి యాంకర్ ఝాన్సీ వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈమె జోగినాయుడిని పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ దంపతులకు కుమార్తె కూడా జన్మించారు. ఇలా కుమార్తె జన్మించిన తర్వాత ఝాన్సీ జోగి నాయుడు మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా వీరిద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విధంగా ఝాన్సీ తన భర్త నుంచి వేరు కావడంతో తన కూతురిని కూడా తన వద్ద ఉంచుకున్నారు.ఇక తమ కూతురికి ధన్య అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ధన్య ఫోటోలను తరచూ ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు కానీ ఎప్పుడూ కూడా ఎలాంటి కార్యక్రమాలలోనూ ఈమెను ప్రేక్షకులకు పరిచయం చేయలేదు. కూతురి ఆలన పాలన తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఝాన్సీఇంటర్వ్యూలో పాల్గొన్న ఝాన్సీ.. కెరీర్‌లో పర్సనల్ లైఫ్ వల్ల చాలా దెబ్బతిన్నానంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. "జోగి నాయుడుతో నేను హ్యాపీగా లేని టైం లో చాలామంది మిమ్మల్ని కలపడానికి ట్రై చేశారు. బట్ నేను ఎవరి మాట వినలేదు. సమాజం ఏమనుకున్నా నాకు అనవసరం, నేను సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. మా ఇద్దరికి పుట్టిన కుమార్తె ధన్య నా వద్దే ఉంటోంది. ఒకానొక సమయంలో నేను డబ్బులు లేక బస్ స్టాప్‌లో నా కూతురిని పట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది.

కాబట్టి అలాంటి సిట్యువేషన్ రాకుండా అమ్మాయిలందరూ ఫైనాన్షియల్‌గా, ఇండిపెండెంట్‌గా ఉండాలని.. స్ట్రాంగ్‌గా ఉంటేనే బాగా పోరాటం చేయగలము" అని యాంకర్ ఝాన్సీ చెప్పుకొచ్చింది. ఇదిలావుండగా తన యాంకరింగ్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. అప్పట్లో రెండే రెండు చానళ్లు నలుగురు యాంకర్లు. మరి ఈరోజు అంటే 33 చానల్లో 44 మంది యాంకర్లుగా మారింది అంటూ సెటైరికల్ గా చెప్పింది. క్యాట్ అండ్ రేస్ అనేది అప్పట్లో ఉంది ఇప్పట్లోను కూడా కొనసాగుతుందని, తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో తప్పులు చేశానని ఆ తప్పులను సరిదిద్దుకుంటూ ఈ స్థాయికి వచ్చామని తన ప్రయాణంలో ఎంతోమంది రచయితలు సహకరించారని తెలిపింది. తన కెరీర్లో ఆల్ టైం ఫేవరెట్ ప్రోగ్రాం టాక్ ఆఫ్ ది టౌన్ అని ఆ ప్రోగ్రాం తో ఎంతో పాపులారిటీ వచ్చిందని తెలిపారు. అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు యాంకర్ ఝాన్సీ.
ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదిలావుండగా అప్పట్లో తన యాంకరింగ్‌తో ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడంటే రష్మీ, అనసూయ, శ్రీముఖి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, అప్పట్లో యాంకర్ అంటే మాత్రం మొదటగా వినిపించే పేరు ఝాన్సీ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలా దూసుకుపోయిన ఈ బ్యూటీ సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'సలార్' మూవీలో కీరోల్‌లో నటించి మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: