అవిస గింజలలో ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. అవిసె గింజలు తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ గింజలని ఈ విధంగా రొట్టెలు వేసుకుని తినండి. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. స్ట్రోక్, గుండె జబ్బులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి. గుండె జబ్బుల్ని దూరం చేస్తాయి. 

పరాటా చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మరెన్నో ఉన్నాయి. అవిసె గింజలతో తయారు చేసిన పరాటా తింటే వెయిట్ లాస్ అవుతారు. అలాగే ఊబకాయాన్ని తగ్గించడంలో మేలు చేస్తాయి. అవిసె గింజలలో ఉండే ఫైబర్ బరువును నియంతరిస్తుంది. గుండె జబ్బుల్ని దూరం చేస్తాయి. కాగా అవిసె గింజల పరాటా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. అవిసె గింజలు, బెల్లం తురుము, గోధుమపిండి, నూనె , పాలు, దేశీ నెయ్యి, సాల్ట్ తీసుకోవాలి. దీన్ని ఏదైనా చట్నీ లేదా సాస్ తో తింటే రుచి అదిరిపోతుంది.

అవిసె గింజల్ని వేయించి.. మిక్స్ పట్టాలి. అవిసె గింజల పొడితో బెల్లం, పాలు వేసి కలపండి. తరువాత వేరే పాత్రలో గోధుమ పిండి, కాస్త ఆయిల్, సాల్ట్ వేసి కలిపి 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని బాల్ గా తయారు చేసి... దీనలో అవిసె గింజల స్టఫింగ్ పెట్టి.. రౌండ్ గా పాన్ పై నెయ్యవేసి కాల్చండి. లేత బంగారు కలర్ లో వచ్చే వరకు కాల్చితే అవిసె గింజల పరాటా తయారు అయినట్లే. దీన్ని ఏదైనా చట్నీ లేదా సాస్ తో తింటే రుచి అదిరిపోతుంది. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. పరాటా చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మరెన్నో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: