పూర్వాకాలం వాళ్లు రాగి పాత్రలో నీరు తాగేవారు. మరి ఈ కాలంలో వాళ్లు ఎవ్వరూ కూడా రాగి పాత్రలో నీరు తాగటం లేని విషయం తెలిసిందే. రాఖీ పాత్రలో ఉంచిన నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ దీనిని సరిగ్గా ఉపయోగించకపోతే, అది హానికరంగా కూడా మారే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. రాగి పాత్రలో నీటిని నిల్వ చేయడానికి సరైన మార్గం ఏమిటంటే, నీతిని రాగి పాత్రల్లో 8-10 గంటలకు మించి ఉంచకూడదు. నీటిని రాగి పాత్రలో ఎక్కువసేపు ఉంచితే, నీటిలో రాగి పరిమాణం పెరుగుతుంది, ఇది శరీరానికి హానికరం. సరైన పాత్రను ఎంచుకోండి. రాగి పాత్రలను కొనుగోలు చేసేటప్పుడు, అది స్వచ్ఛమైన రాగితో తయారు చేసిందనిని మాత్రమే వాడండి. నకిలీ లేదా కల్తీ రాగి పాదాలు ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం కూడా ఉంది.

మీరు రాగి పాత్రలో నీరు తాగితే, మీ శరీరంలో రాగి తాయిని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. దీనితో మీరు కాపర్ టాక్సిసిటి ప్రమాదాన్ని నివారించవచ్చు. రాగి పాత్రలో ఉంచిన నీరు విషపూరితంగా మారదు, కానీ దీనిని సరిగ్గా శుభ్రం చేసుకోవడం అవసరం. రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల ప్రయోజనాలు: యాంటీబాక్టీరియల్ గుణాలు – రాగికి సహజమైన బ్యాక్టీరియా నిరోధకత ఉంటుంది, అందువల్ల నీరు శుద్ధి అయ్యే అవకాశముంది. ఆరోగ్యానికి మేలు – రాగి జీర్ణ క్రియను మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటుంది.

మెటాబాలిజాన్ని మెరుగుపరచడం – రాగి నీరు త్రాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లి మెటాబాలిజం మెరుగవుతుంది. ఇమ్యూనిటీ పెంపు – రాగిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మినరల్స్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాత రాగి పాత్రలు వాడకూడదు – అవి ఆక్సిడైజ్ అయ్యి హానికరమైన పదార్థాలను విడుదల చేసే అవకాశముంది. శుభ్రం చేయడం చాలా ముఖ్యం – నీటిలో ఉన్న ఖనిజాల వలన రాగిపై గ్రీన్ కలర్ (పాటినా) వచ్చే అవకాశముంది. ఇది ఎక్కువగా పేరుకుపోతే హానికరం కావచ్చు. వెనిగర్ లేదా నిమ్మరసం తో శుభ్రం చేయాలి. అధికంగా ఉంచుకోవద్దు – రాగి పాత్రలో నీటిని 6-8 గంటల పాటు ఉంచితే చాలు. దీన్ని చాలా ఎక్కువ సమయం నిల్వ చేయడం అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: