
ఈ సర్వే చేసిన అధికారులే ఇదంతా చూసి ఆశ్చర్యపోయారట.. ఆరు నెలల్లో మహిళలు బంగారం కంటే ఎక్కువగా ప్రాజెక్టులను 31 శాతం మంది మహిళలు ఎంచుకున్నారట.. డబ్బులపరంగా చూసుకుంటే..45 లక్షల లోపు వాటిని 16% మంది.. 45 నుంచి 90 లక్షలు 32 శాతం మంది.. 90 నుంచి ఒకటిన్నర కోటి 33% మంది .. ఒకటిన్నర నుంచి రెండున్నర కోట్ల వరకు 11% మంది.. రెండున్నర కోట్లకు మించి మరి 8% శాతం వరకు కొన్నారు మహిళలు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఒక వాస్తవం ఉన్నదట. నిజానికి వాళ్లు సంపాదనతో కొన్నారంటే కాదు ఇంట్లో ఉంటే భర్తల సంపాదనతోనే వారి పేరు మీద ఈ ఆస్తులన్నీ కొని ఉంటారని తెలియజేస్తూ ఉన్నారు.
గతంలో ఎక్కువగా మహిళలు బంగారం అంటే ఎక్కువగా ఇష్టపడేవారు కానీ ఈమధ్య ధర భారీగా పెరిగిపోవడంతో చాలామంది భూములు, ఏదైనా స్థలాల మీద ఎక్కువగా కొనడానికి మక్కువ చూపుతున్నారట. మరి రాబోయే రోజుల్లో బంగారం కొనడం మరింత తగ్గిపోతుందని నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.