
ఇకపోతే ఈ స్కీం యొక్క మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు కాబట్టి అమ్మాయి కి 18 ఏళ్లు నిండగానే కొంత మొత్తంలో మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు 15 సంవత్సరాల పాటు ఈ పథకంలో డిపాజిట్ చేసిన తర్వాత ఏకంగా 65 లక్షల రూపాయలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సమృద్ధి యోజన పథకం మీద 7.6 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక ఈ పథకంలో మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీరేట్లను మారుస్తుంది కాబట్టి వడ్డీ శాతం పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
ముఖ్యంగా ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.. కనుక ఈ స్కీం లో ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా చేరవచ్చు. 10 సంవత్సరాల వయసు లోపే ఈ పథకంలో చేరాల్సి ఉంటుంది. ఇక భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలి అంటే సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. అంటే రోజుకు 416 రూపాయలు ఆదా చేయడం వల్ల మెచ్యూరిటీ సమయం అనగా 15 సంవత్సరాల ముగిసేసరికి అమ్మాయి చేతికి 65 లక్షల రూపాయలు వస్తాయి. మీకు దగ్గరలో ఉన్న పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా వెళ్లి మీ కూతురు పేరు పైన ఈ అకౌంట్ తెరవచ్చు.