తాజాగా దేశంలో మొదటిసారి కౌలు రైతులతోపాటు దేవాదాయ, అడవి భూములను కూడా సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2023 - 24 సీజన్ కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సహాయాన్ని గురువారం రోజు అందించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పంట హక్కు, సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలుదారులు, దేవాదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరిగా రూ .7,500 చొప్పున ఈరోజు నేరుగా రైతన్నల ఖాతాలో జమ కానుంది.

ఇప్పటికే రైతులకు రూ.7500 సహాయం చొప్పున రూ.109.74 కోట్ల సహాయం పంపిణీ చేయనున్నారు.. ఈరోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో జరగబోతున్న కార్యక్రమంలో..  కార్యక్రమం పూర్తిగా ముగిసిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాలకు నేరుగా ఈ సహాయాన్ని అందించబోతున్నారు. ఇకపోతే రాష్ట్రంలోని భూ యజమానులకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ .13,500 చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందిస్తుండగా.. మే నెలలో రూ.7,500, అక్టోబర్ నెలలో రూ.4,000,  జనవరిలో మరో రూ.2వేలు చొప్పున 3 విడతల్లో ఈ సహాయాన్ని అందజేస్తుంది.

అదేవిధంగా ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమిలేని ఎస్సీ, ఎస్టీ , బీసీ,  మైనార్టీ వర్గాలకు చెందిన కవులు రైతు కౌలు కుటుంబాలతో పాటు అటవీ దేవాదాయ భూమి సాగు దారులకు కూడా ఇప్పుడు రూ .13,500 చొప్పున పెట్టుబడి సహాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులతోనే అందజేస్తుంది. మొత్తంగా అందరికీ కలిపి ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మీద పెట్టుబడి సహాయాన్ని అందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: