40 కోట్ల రూపాయిలు అంటే మామూలు విషయం కాదు. సూపర్ హిట్ సాధించిన తెలుగు సినిమాలు ఆ మొత్తాన్ని సాధిస్తుంటాయి. అయితే ఒక బాలీవుడ్ సినిమా విడుదల కాకుండానే అంత పెద్ద మొత్తాన్ని అవలీలగా సాధించింది. అజయ్ దేవగన్, తమన్నా నటిస్తున్న ‘హిమ్మత్ వాలా’ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రముఖ టెలివిజన్ చానెల్ 40 కోట్ల  రూపాయిలను చెల్లించి ఆ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. అజయ్ దేవగణ్ ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో ఈ చిత్రానికే ఇంత భారీ మెుత్తం లభించింది. ఆయన హీరోగా నటించిన ‘సన్నాఫ్ సర్థార్’ చిత్రానికి శాటిలైట్ హక్కుల రూపేణా 33 కోట్ల రూపాయిలు లభించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: