ఈ మద్య ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా..వెంటనే అది సోషల్ మాద్యమాల్లో ప్రత్యక్షం అవుతుంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ప్రీమియం షోలో వేసిన కొన్ని గంటల్లోనే నెట్టింట్లో ప్రత్యక్షం కావడం సినీ ఇండస్ట్రీని కలచి వేస్తుంది. ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది..అయితే ఈ ఎఫెక్ట్ మాత్రం సినిమా ఇండస్ట్రీలపై నెగిటీవ్ గా పడుతుందనే చెప్పాలి. గతంలో పైరసీ వీడియలో బయటికి రావాలంటే కొన్ని రోజులు పట్టేవి..కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని గంటల్లోనే ప్రబలిపోతుంది.
మరోదారుణమైన విషయం ఏంటంటే..గతంలో కొన్ని సినిమాలు రిలీజ్ కాక ముందే నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యాయి..పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’, బాహుబలికి సంబంధించిన యుద్ద సన్నివేశం, కొన్ని బాలీవుడ్ సినిమాలు, ఆ మద్య రజినీ నటించిన కబాలి చిత్రం కూడా రిలీజ్ కి ముందే నెట్ లో వచ్చినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ, మెహ్రీన్ నటించిన ‘రాజా ది గ్రేట్’ పాజిటీవ్ టాక్ తో దుమ్మురేపుతుంది. కాగా, రాజా ది గ్రేట్ కి ఓ ఎదురు దెబ్బ తగిలినట్టు సమాచారం.
రాజా ది గ్రేట్ సినిమా ఫేస్బుక్తోపాటు పలు పైరసీ సినిమాల వెబ్సైట్లలో ప్రత్యక్షమైందట. బుధవారం రిలీజైన ఈ సినిమాకు ఈసారి దీపావళి పండగ కారణంగా కలిసొచ్చిన లాంగ్ వీకెండ్ ఓ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం వుంది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న ప్రకారం రిలీజైన తొలి రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 10 కోట్ల వరకు సాధించినట్టు సమాచారం. కొత్త సినిమాలని పైరసీ చేసే వెబ్సైట్లలో రాజా ది గ్రేట్ ఉన్నట్లు సమాచారం అందుకోవడంతో తగు చర్యలకు సమాయత్తం అవుతున్నారు.
మరోవైపు రాజా ది గ్రేట్ సినిమా పైరసీనీ ప్రోత్సహించకుండా నేరుగా థియేటర్లలోనే చూసి సినిమాను ఎంజాయ్ చేయాల్సిందిగా ఆడియెన్స్కి విన్నవించుకున్నాడు.అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రవితేజ, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా నటించగా రాధిక, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంపత్ వంటి నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషించారు.