‘గీతగోవిందం’ తర్వాత విజయ్ కి ఏర్పడిన మ్యానియాతో అనేకమంది స్టార్ డైరెక్టర్లు విజయ్ దేవరకొండని కాంటాక్ట్ చేసారు. అయితే వారితో వెంటనే సినిమా ఓకే చేసేసుకోకుండా మంచి కథ కుదిరితేనే సినిమా చేస్తాను అంటూ విజయ్ తన సహజ సిద్దమైన యాటిట్యూడ్ చూపించడంతో అప్పట్లో చాలమంది టాప్ డైరెక్టర్స్ హర్ట్ అయ్యారు అన్న వార్తలు వచ్చాయి. వాస్తవానికి పూరి జగన్నాథ్ విజయ్ తో 'ఇస్మార్ట్ శంకర్' తీస్తాను అంటే ఖాళీ లేదు అంటూ విజయ్ తప్పించుకున్న విషయం తెలిసిందే.
అలాంటి విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాథ్ ను నమ్ముకుని సినిమా చేయడానికి అంగీకరించడం వెనుక పెద్ద కథ నడిచింది అని వార్తలు వస్తున్నాయి. 'డియర్ కామ్రేడ్' ఫ్లాప్ తర్వాత బాగా షేక్ అయిన విజయ్ ఇప్పట్లో స్టార్ డైరెక్టర్లు ఎవరు తన కోసం క్యూ కట్టరని తెలుసుకుని వెంటనే పూరితో వెంటనే సినిమాకు ఓకే అన్నాడు అన్న ప్రచారం జరుగుతోంది.
ఈమూవీ ప్రాజెక్ట్ విషయంలో పూరి టర్మ్స్కి పూర్తిగా విజయ్ లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ కి భారీ అడ్వాన్స్ లు ఇచ్చిన బ్యానర్లు ఉన్నా వారెవ్వర్ని నిర్మాతలుగా పూరి ప్రాజెక్ట్ కు వ్యవహరించే విషయంలో విజయ్ ఎంత ప్రయత్నించినా పూరీ ఒప్పుకోలేదు అని తెలుస్తోంది.
ఈ మూవీ ప్రాజెక్ట్ అంతా తన సొంత బ్యానర్ పై ఛార్మీ ఆద్వర్యంలో నిర్మాణం జరుగుతుందనీ ఈ మూవీ విషయంలో తాను ఎవరితోనూ భాగస్వామ్యం చేయను అని పూరి కండిషన్స్ పెట్టినట్లు టాక్. దీనితో ఈ విషయం పై పట్టుపడితే పూరీ కూడ జారిపోతాడు అన్న భయంతో విజయ్ ఈ మూవీ ప్రాజెక్ట్ ను ఓకె చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికితోడు పూరీతో సినిమా అంటే ఒక లాటరీ టిక్కెట్ అన్న అభిప్రాయం విజయ్ కి కూడ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాప్ దర్శకులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో తనకు ఇచ్చే పారితోషిక విషయంలో కూడ ఎటువంటి కొత్త డిమాండ్స్ పెట్టకుండా విజయ్ ఒక మెట్టు దిగి పూరీతో సినిమాను చేస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి..