ఈ రెండు సినిమాలు షూటింగ్ మొదలు పెట్టలేదు. కార్తికేయ-2 తో పాటుగా 18 పేజెస్ సినిమాను ఒకేసారి పూర్తి చేయాలని అనుకుంటున్నాడు నిఖిల్. ఇక ఇప్పుడు ఈ రెండిటితో పాటుగా మరో సినిమా ఓకే చేశాడు. ఏషియన్ గ్రూప్ కు చెందిన శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో నిఖిల్ 20వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని నాయాణ దాస్, పుస్కుర్ రామ్ ఎమ్ రావు నిర్మాతలుగా చేస్తున్నారు.
ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నిఖిల్ కెరియర్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. కార్తికేయ-2, 18 పేజెస్ ఈ రెండు సినిమాలు క్రేజీ ప్రాజెక్టులు కాగా దీనితో పాటుగా రాబోయే నిఖిల్ 20వ సినిమా కూడా భారీగా వస్తుందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు డైరక్టర్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. డైరక్టర్ ఓకే అయ్యాక సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది వెళ్ళడిస్తారు.