ప్రస్తుతం నాని శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగ రాయ్ సెట్స్ మీదకు వెళ్తుంది. టక్ జగదీష్ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్యామ్ సింగ రాయ్ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారని తెలుస్తుంది. శ్యామ్ సింగ రాయ్ నాని కెరియర్ లో స్పెషల్ మూవీగా ఉంటుందని టాక్. అంతేకాదు సినిమాలో నాని డ్యుయల్ రోల్ చేస్తాడని అంటున్నారు.
వి సినిమా రిజల్ట్ తర్వాత నాని తన సినిమాల మీద మరింత ఫోకస్ పెట్టాడు. తప్పకుండా నాని శ్యామ్ సింగ రాయ్, టక్ జగదీష్ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమాల తర్వాత నాని వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికి అనే మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా కూడా క్రేజీగా ఉండబోతుందని టాక్. మరోసారి నాని వరుస సినిమాలతో ఫామ్ కొనసాగించేలా ఉన్నాడని చెప్పొచ్చు.