ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.అల్లరి నరేష్ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కామెడీ టైమింగ్ తో ఎన్నో వినోదంభరితమైన సినిమాలు చేసి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఇక లాక్ డౌన్ తరువాత "బంగారు బుల్లోడు" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అల్లరి నరేష్ హీరోగా పూజా జవేరి హీరోయిన్ గా ఏ.టీవీ సమర్పణలో ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘బంగారు బుల్లోడు’. ప్రభాస్ శ్రీను, భద్రం, నటి రజిత వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నిజానికి 2 ఏళ్ళ క్రితమే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తుంది.ఎట్టకేలకు ఈ చిత్రం జనవరి 23న విడుదలయ్యింది. ఇది వరకు మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్న అల్లరి నరేష్.. ఈ మధ్యకాలంలో సరైన హిట్టు అందుకోలేకపోతున్నాడు. కనీసం ఓపెనింగ్స్ కూడా అతని చిత్రాలకు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ విషయం ‘బంగారు బుల్లోడు’ తో మరోసారి రుజువు అవ్వడం జరిగింది.

ఇక "బంగారు బుల్లోడు" మూడవ రోజు కలెక్షన్లు చాలా దారుణంగా పడిపోయాయి. ‘బంగారు బుల్లోడు’ చిత్రానికి 3.5కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 4కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 1.28 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి మరో 2.72 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నిన్న ఈ చిత్రం కేవలం 0.16 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.ఇక చూడాలి ఈ కనీసం బ్రేక్ ఈవెన్ అయిన సాధిస్తుందో లేదో.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: