అయితే తెలుగు చిత్ర పరిశ్రమ లో వస్తున్న మొదటి జాంబి సినిమా ఇదే కావడం గమనార్హం. అయితే ఈ సినిమా భయపెట్టడం తో పాటు కడుపుబ్బ నవ్విస్తుంది అని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెబుతున్నాడు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శరవేగంగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రధానపాత్రలో చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ప్రస్తుతం మంచి క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్న తేజ సజ్జ నటించగా ఇక హీరోయిన్గా దక్ష నాగర్కర్ నటించింది.
అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ దక్ష పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తన తొలి చిత్రం హోరాహోరి అంటూ చెప్పుకొచ్చింది. బీబీయే మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో.. తేజ గారి దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చింది. ఇక ఆ తరువాత చదువు కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చాను అంటూ తెలిపింది. 'అ' సినిమాలో నిత్యామీనన్ పాత్రలో నటించను అంటూ తెలిపింది. ఆ సమయంలో మెచ్యూరిటీ లేక ఎన్నో ఆఫర్లకు నో చెప్పానని కానీ ఇప్పుడు మాత్రం వస్తే ప్రతి ఆఫర్ కి ఎస్ చెప్పేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.